ఓ ఇంటివాడైన శర్వానంద్

హీరో శర్వానంద్ ఓ ఇంటివాడయ్యాడు. రాత్రి జరిగిన వివాహ వేడుకలో రక్షితా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశారు. అలా తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతూ, రక్షితతో వైవాహిక బంధంలోకి…

హీరో శర్వానంద్ ఓ ఇంటివాడయ్యాడు. రాత్రి జరిగిన వివాహ వేడుకలో రక్షితా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశారు. అలా తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతూ, రక్షితతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు ఈ హీరో.

జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది శర్వానంద్ వివాహం. 2 రోజుల పాటు సాగిన ఈ వేడుక కోసం లీలా ప్యాలెస్ ను అందంగా ముస్తాబు చేశారు. ఇరు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు ఒక రోజు ముందే ప్యాలెస్ కు చేరుకున్నారు. మెహందీ ఫంక్షన్ తో సంబరాలు షురూ చేశారు.

ఇక సంగీత్ టైమ్ కు రామ్ చరణ్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. సంగీత్ లో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో డోంట్ స్టాప్ డాన్సింగ్ పాటకు డాన్స్ చేశారు శర్వానంద్-రక్షిత.

ఇక రాత్రి 11 గంటల నుంచి అసలైన పెళ్లి తంతు మొదలైంది. రక్షిత మెడలో శాస్త్రోక్తంగా మూడు ముళ్లు వేశాడు శర్వానంద్. శర్వానంద్‌, రక్షితా ల నిశ్చితార్థం జనవరిలో జరిగింది. రాత్రి వీళ్లిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత నూతన దంపతులిద్దరూ కలిసి దిగిన ఫొటోను విడుదల చేశారు.