అఖిల్ డేట్ ఇచ్చేసాడు

పోస్ట్ సమ్మర్ సినిమా డేట్ లు కూడా మొదలయ్యాయి. సురేందర్ రెడ్డి-అఖిల్ కాంబినేషన్ లో తయారవుతున్న భారీ సినిమా ఏజెంట్ విడుదల డేట్ అనౌన్స్ చేసారు. ఆగస్టు 12న ఆ సినిమా విడుదల కాబోతోంది. …

పోస్ట్ సమ్మర్ సినిమా డేట్ లు కూడా మొదలయ్యాయి. సురేందర్ రెడ్డి-అఖిల్ కాంబినేషన్ లో తయారవుతున్న భారీ సినిమా ఏజెంట్ విడుదల డేట్ అనౌన్స్ చేసారు. ఆగస్టు 12న ఆ సినిమా విడుదల కాబోతోంది. 

అనిల్ సుంకర సుమారు యాభై కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఇది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం జులై వరకే సినిమాల డేట్ లు ప్రకటించి వున్నారు. 

ఇప్పుడు ఆగస్టు నెల రిజ‌ర్వేషన్లు ప్రారంభం అయ్యాయి. ఇటలీలో కొంత భాగం షూట్ చేసుకున్న ఈ సినిమాలో హీరో అఖిల్ రా ఏజెంట్ గా కనిపిస్తాడు. మమ్ముట్టి రా చీఫ్ గా కనిపిస్తాడు.

సైరా సినిమా తరువాత సురేందర్ రెడ్డి అందిస్తున్న సినిమా ఇది. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ ను ఒకటికి రెండు సార్లు మార్చి ఫైన్ ట్యూన్ చేసారు. 

అఖిల్ మార్కెట్ కూడా లెక్కించకుండా బడ్జెట్ పెట్టి తీస్తున్నారు. అఖిల్ ఈ సినిమా మీద చాలా హోప్ తో వున్నాడు.