వరంగల్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కొండా మురళి, నూతన జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వర్గానికి చెందిన కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. వరంగల్ అధ్యక్షురాలు, పిసిసి సభ్యుల సాక్షిగా చెప్పులు, పిడుగుద్దులతో కార్యకర్తలు దారుణంగా కొట్టుకున్నారు.
జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఎర్రబెల్లి స్వర్ణ.. మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఇంటికి వెళ్లి కలువలేదని, ప్రమాణస్వీకారం కార్యక్రమానికి వారిని ఆహ్వానించలేదని కొండా వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెండు వర్గాలు విడిపోయిన కార్యకర్తలు గోడవకు దిగి.. కార్యకర్తలు చెప్పులతో కొట్టుకున్నారు.
కాగా వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవిని కొండా దంపతులు తమ వర్గానికి చెందిన వారికే కట్టబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసిన.. పార్టీ నాయకత్వం మాత్రం ఎర్రబెల్లి స్వర్ణను ఎంపిక చేసింది దీంతో తమకు సహకరించాలని కొండా దంపతులను ఎర్రబెల్లి స్వర్ణ దంపతులు కలిసి కోరినట్లు స్వర్ణ వర్గీయులు చెబుతున్నారు. ఇందుకు కొండా దంపతులు కూడా అంగీకరించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆ వర్గం నాయకులు చెబుతున్నారు. కానీ తీరా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు.