ఎట్టకేలకు సమంత నుంచి మరో సినిమా

జాను తర్వాత ఇక సినిమాలు చేయదని అనుకున్నారు. పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కు పరిమితమైపోతుందని, తల్లి అయ్యే ఆలోచనలో ఉందని కూడా ప్రచారం జరిగింది. దీనికి మరింత ఆజ్యం పోస్తూ సమంత కూడా 'ఆహా'లో…

జాను తర్వాత ఇక సినిమాలు చేయదని అనుకున్నారు. పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కు పరిమితమైపోతుందని, తల్లి అయ్యే ఆలోచనలో ఉందని కూడా ప్రచారం జరిగింది. దీనికి మరింత ఆజ్యం పోస్తూ సమంత కూడా 'ఆహా'లో యాంకర్ గా మారిపోయింది. 

టెర్రస్ గార్డెనింగ్ తో బిజీ అయిపోయింది. సాకి బ్రాండ్ పనులు భూజానికెత్తుకుంది. దీంతో సమంత ఇక సినిమాలు చేయదని అంతా అనుకున్నారు. కానీ ఎట్టకేలకు సమంత నుంచి సినిమా ప్రకటన వచ్చేసింది.

ఆ మధ్య దర్శకుడు గుణశేఖర్, శాకుంతలం అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో లీడ్ రోల్ పోషించడానికి సమంత అంగీకరించింది. ఈ మేరకు ఈరోజు గుణ టీమ్ వర్క్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. శాకుంతలగా సమంత కనిపించబోతోందంటూ వాళ్లు ప్రకటన ఇచ్చేశారు.

నిజానికి ఈ సినిమాను ప్రకటించిన వెంటనే పూజా హెగ్డే పేరు తెరపైకి వచ్చింది. కాస్త లేట్ అయినా పూజా హెగ్డేతోనే ఈ సినిమాను నిర్మిస్తామంటూ గుణశేఖర్ టీమ్ నుంచి ఫీలర్లు కూడా వచ్చాయి. కానీ సమంత ఈ మైథలాజికల్ పాత్ర పోషించేందుకు ముందుకు రావడంతో గుణశేఖర్ వెంటనే ఎనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు. శాకుంతలంలో కావ్యనాయకిగా సమంత ఫిక్స్.

ఈ బిగ్ బడ్జెట్ మైథలాజికల్ మూవీకి గుణశేఖర్ దర్శకుడు. నిర్మాత కూడా అతడే. మణిశర్మ సంగీతం అందించబోతున్నాడు. మూవీ ఎప్పట్నుంచి సెట్స్ పైకి వస్తుందనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

ఇంతవరకూ ఒకా ఛాన్స్ కూడా రాలేదు

సంక్షేమ నామ సంవ‌త్స‌రం!