నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత

ప్రముఖ నటుడు నర్సింగ్ యాదర్ ఈరోజు కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు నర్సింగ్ యాదవ్. కొన్నాళ్ల నుంచి వైద్యులు ఆయనకు డయాలసిస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత క్షీణించడంతో…

ప్రముఖ నటుడు నర్సింగ్ యాదర్ ఈరోజు కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు నర్సింగ్ యాదవ్. కొన్నాళ్ల నుంచి వైద్యులు ఆయనకు డయాలసిస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో కొద్దిసేపటి కిందట తుదిశ్వాస విడిచారు నర్సింగ్ యాదవ్.

కెరీర్ లో 300కు పైగా సినిమాల్లో నటించారు నర్సింగ్ యాదవ్. విలన్ గా ఆయన ఎంత పాపులర్ అయ్యారో, కామెడీ వేషాలకు షిఫ్ట్ అయి, కమెడియన్ గా కూడా అంతే పాపులర్ అయ్యారు. విలక్షణమైన తెలంగాణ యాసతో, సీరియస్ గా కనిపిస్తూనే కామెడీ చేయడం నర్సింగ్ యాదవ్ స్పెషాలిటీ.

విజయనిర్మల దర్శకత్వం వహించిన హేమాహేమీలు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నర్సింగ్ యాదవ్. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అన్ని మూవీస్ లో నటించారు. రేసుగుర్రం, సుడిగాడు, కిక్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాల్లో ఆయన నటనకు మంచి పేరొచ్చింది.

52 ఏళ్ల నర్సింగ్ యాదవ్ కు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు. నర్సింగ్ యాదవ్ మృతిపై టాలీవుడ్ తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తోంది.