బుల్లితెర నటుడు ఆదిత్యసింగ్ రాజ్పుత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముంబై అంధేరిలోని తన ఇంటి బాత్రూమ్లో కదలిక లేకుండా పడివున్న ఆదిత్యసింగ్ను అతడి స్నేహితుడు, వాచ్మెన్ కలిసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టంలో ఆత్మహత్య చేసుకున్నారా లేక హత్యా అనేది తెలియనుంది.
ఢిల్లీకి చెందిన ఆదిత్యసింగ్ మోడల్గా తన కెరీర్ను ప్రారంభించాడు. ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో, వాణిజ్య ప్రకటనల్లో నటించారు. ఎంటీవీ ప్రసారం చేసే స్ప్లిట్స్ విల్లా 9 సీజన్ అతనికి బాగా పేరు తెచ్చింది. “క్రాంతివీర్”, “మైనే గాంధీ కో నహిన్ మారా”, “లవ్” వంటి చిత్రాలలో కూడా నటించారు.
కాగా ఆదిత్యసింగ్ డ్రగ్స్ ఓవర్ డోస్ కావడం వల్ల మరణించాడనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆదిత్య సింగ్ ఐదు రోజుల క్రితం కూడా ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్టుకు హ్యాప్పినెస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు..? అంటూ పోస్ట్ చేశారు. ఇంతలోనే అతను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.