పవన్ పై జ‌గన్ కక్ష-జేసీ

పవన్ కళ్యాణ్ మీద ఆంధ్ర సిఎమ్ జ‌గన్ కక్ష కట్టారని తేదేపా నాయకుడు జేసీ ప్రభాకర రెడ్డి అన్నారు. తనకు కిట్టని ప్రతి ఇండస్ట్రీని జ‌గన్ టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భీమ్లా నాయక్…

పవన్ కళ్యాణ్ మీద ఆంధ్ర సిఎమ్ జ‌గన్ కక్ష కట్టారని తేదేపా నాయకుడు జేసీ ప్రభాకర రెడ్డి అన్నారు. తనకు కిట్టని ప్రతి ఇండస్ట్రీని జ‌గన్ టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భీమ్లా నాయక్ సినిమా మీద కక్ష కట్టడం వల్ల పల్లీలు అమ్ముకునే వారి దగ్గర నుంచి చాలా మంది బతుకులు పాడవుతున్నాయని ఆయన అన్నారు.

చిరంజీవికి, పవన్ కు పోయిందేమీ లేదని, జ‌గన్ ఇగో వల్ల ఏదేదో చేస్తున్నారని, తనను, తన కొడుకును జైలు పాలు చేసారని, ఇప్పుడు ఏమీ అయిపోలేదని, ఇక్కడ కాకపోతే మరో చోట బతుకుతా అని ఆయన అన్నారు. పవన్ కు ఏమీ పోదని, మరింత పాపులారిటీ వస్తుందని అన్నారు.

ఆసుపత్రులు, స్కూళ్లు, అమర్ రాజా బ్యాటరీలు ఇలా ప్రతి ఒక్కరి మీదా పడుతున్నారని, కక్ష సాధింపు మంచిది కాదని ప్రభాకర రెడ్డి అన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఒక్కరే క్యాబినెట్ లో మంచి వాడని, అందుకే అతను చనిపోతే వేలాది మంది వచ్చారని, మిగిలిన మంత్రులంతా బండ బూతులు తిట్టేవారే అని ఆయన అన్నారు.

తిరుపతిలో రేట్లు పెంచేయవచ్చు కానీ సినిమా టికెట్ ల రేట్లు పెంచకూడదా అని ఆయన ప్రశ్నించారు.