బయటకు వచ్చిన మెగా హీరో

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చాన్నాళ్ల తరువాత బయటకు వచ్చారు. తీవ్ర ప్రమాదానికి గురై, చాన్నాళ్లు ఆసుపత్రిలో, ఆ పై ఇంట్లో చికిత్స తీసుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. …

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చాన్నాళ్ల తరువాత బయటకు వచ్చారు. తీవ్ర ప్రమాదానికి గురై, చాన్నాళ్లు ఆసుపత్రిలో, ఆ పై ఇంట్లో చికిత్స తీసుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. 

ఫిట్ గా మారారు. ఇకపై షూటింగ్ లకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విజ‌యవాడ వెళ్లి వచ్చారు.

తల్లి మొక్కు ప్రకారం ప్రమాదం నుంచి కోలుకున్న తరువాత ముందుగా బెజ‌వాడ కనకదుర్గ గుడికి వెళ్లి దర్శనం, పూజ‌లు చేసుకుని వచ్చారు. రోడ్ వే లో కుటుంబ సభ్యులతో బెజ‌వాడ వెళ్లి దర్శనం చేసుకుని వచ్చారు. ఇకపై షూటింగ్ లు ప్రారంభిస్తారు.

ముందుగా భోగవిల్లి ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా పూర్తి చేయాల్సి వుంది. ఆపైన మేనమామ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా నిర్మించే సినిమా స్టార్ట్ చేస్తారు. ఈ రెండూ కాక మరో రెండు ప్రాజెక్టులు సాయిధరమ్ తేజ‌ చేతిలో వున్నాయి.