మూడో భార్య వ‌సూళ్ల‌తో సంబంధం లేదుః న‌టుడు

త‌న పేరు చెప్పుకుని ర‌మ్య ర‌ఘుప‌తి అనే మ‌హిళ‌న చేస్తున్న డ‌బ్బు వ‌సూళ్ల‌తో త‌న‌కెలాంటి సంబంధం లేద‌ని న‌టుడు న‌రేష్ పేర్కొన్నారు. డ‌బ్బు వ‌సూళ్ల‌కు సంబంధించి ర‌మ్య ర‌ఘుప‌తిపై గ‌చ్చిబౌలి పోలీస్‌స్టేష‌న్‌లో ఐదురుగురు మ‌హిళ‌ల…

త‌న పేరు చెప్పుకుని ర‌మ్య ర‌ఘుప‌తి అనే మ‌హిళ‌న చేస్తున్న డ‌బ్బు వ‌సూళ్ల‌తో త‌న‌కెలాంటి సంబంధం లేద‌ని న‌టుడు న‌రేష్ పేర్కొన్నారు. డ‌బ్బు వ‌సూళ్ల‌కు సంబంధించి ర‌మ్య ర‌ఘుప‌తిపై గ‌చ్చిబౌలి పోలీస్‌స్టేష‌న్‌లో ఐదురుగురు మ‌హిళ‌ల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదైంది. హైద‌రాబాద్‌, అనంత‌పూర్‌, హిందూపురంల‌లో ర‌మ్య భారీగా డ‌బ్బు వ‌సూలు చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయి రమ్య ర‌ఘుప‌తితో న‌రేష్‌కు గ‌ల అనుబంధం గురించి తెలుసుకుందాం.

న‌రేష్‌కు ర‌మ్య ర‌ఘుప‌తి మూడో భార్య‌. 8ఏళ్ల‌ క్రితం వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం విడిగా ఉన్నార‌ని స‌మాచారం. అనంతపురం జిల్లా సీనియ‌ర్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి సోదరుని కుమార్తె రమ్య రఘుపతి. ఈమె ఆస్ట్రేలియాలో ఫిలిం మేకింగ్ కోర్స్ పూర్తి చేసింది. ఆ త‌ర్వాత దర్శకుడు నీలకంఠ దగ్గర నందనవనం సినిమాకి అసిస్టెంట్‌గా పని చేస్తున్నప్పడు నరేష్‌తో పరిచయం ఏర్పడింది. 

అనంత‌రం న‌రేష్ త‌ల్లి విజయ నిర్మల దగ్గర కో డైరెక్టర్‌గా కూడా ప‌ని చేసింది. అప్పుడే న‌రేష్‌, ర‌మ్య మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఇరు కుటుంబాల వారిని ఒప్పించి నరేష్, రమ్య వివాహం చేసుకున్నారు. మూడో పెళ్లి సమయానికి నరేష్‌కు 50 ఏళ్లు, ర‌మ్య‌కు ఆయ‌న‌లో స‌గం వ‌య‌సు. వీరికి రణవీర్ అనే కొడుకు ఉన్నాడు. ఆ త‌ర్వాత వాళ్లిద్ద‌రి విభేదాలు చోటు చేసుకున్నాయి. 

న‌రేష్‌కు ఉన్న ఆస్తుల్లో త‌న‌కు భాగం వుందంటూ, ప‌లువురి నుంచి భారీ మొత్తంలో డ‌బ్బు వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆమె ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇది కేసుల వ‌ర‌కూ దారి తీసింది. ర‌మ్య ర‌ఘుప‌తి డ‌బ్బు వ‌సూళ్ల‌తో త‌న‌కెలాంటి సంబంధం లేద‌ని న‌రేష్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి న‌రేష్‌, ర‌మ్య సంబంధాలపై చ‌ర్చ‌కొచ్చింది.