దారుణం: తల్లిదండ్రుల్ని హత్య చేసిన కూతురు

కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. డబ్బుకు కక్కుర్తిపడి కన్న తల్లిదండ్రుల్ని ఓ కూతుకు హత్య చేసింది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. క్షణాల్లో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుల్ని…

కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. డబ్బుకు కక్కుర్తిపడి కన్న తల్లిదండ్రుల్ని ఓ కూతుకు హత్య చేసింది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. క్షణాల్లో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో ముత్తయ్య-సుగుణమ్మ ఉంటున్నారు. వీళ్లకు మనీషా అనే కూతురు ఉంది. ఆమెకు పెళ్లి కూడా చేశారు. అల్లుడు నెమలి బాబూరావు వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. అందరూ కలిసే ఉంటున్నారు.

అయితే మనీషాకు మాత్రం ఆనందం లేదు. ఆస్తి మొత్తం తన పేరు మీద ఉండాలనేది ఆమె కోరిక. దీనిపై ఎన్నోసార్లు తల్లిదండ్రులతో వాదులాటకు దిగింది కూడా. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల్ని అంతమొందించాలని నిర్ణయించుకుంది. వాళ్లు చస్తే తప్ప తనకు ఆస్తి దక్కదని భావించిన మనీషా.. భర్త బాబూరావుతో కలిసి హత్యకు కుట్ర పన్నింది.

4 రోజుల కిందటే భార్యాభర్తలిద్దరూ హత్యకు కుట్ర పన్నారు. అనుకున్న విధంగానే నిన్న రాత్రి ముత్తయ్య-సుగుణమ్మను కడతేర్చారు. మనీషా ప్లాన్ ప్రకారం, కత్తితో బాబూరావే వాళ్లను పొడిచి చంపినట్టు పోలీసులు ప్రాధమికంగా నిర్థారించారు. 

బిగ్ బాస్ విన్న‌ర్ ఎవ‌రో నాకు తెలుసు