‘మంగళవారం”ఏమయ్యిందో ఏమిటో’

'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'మంగళవారం'. పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. నవంబర్ 17న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి 'ఏమయ్యిందో…

'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'మంగళవారం'. పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. నవంబర్ 17న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి 'ఏమయ్యిందో ఏమిటో…' పాటను విడుదల చేశారు. బి. అజనీష్ లోక్‌నాథ్ ఇచ్చిన బాణీకి చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా హర్షిక ఆలపించారు.

అందమైన గోదావరి, పల్లెటూరి నేపథ్యంలో 'ఏమయ్యిందో ఏమిటో…' పాటను తెరకెక్కించారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్ జంటగా కనిపించారు. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా 'ఏమయ్యిందో ఏమిటో… నిలవదు మనసే' మెలోడీ ఉందనే చెప్పాలి. 'మంగళవారం' నుంచి ఇప్పటికే తొలి పాట 'గణగణ మోగాలిరా' విడుదలైంది. ఆ పాటలో ఊరు ప్రజల్లో భయాన్ని అజయ్ భూపతి చూపించారు. ఇప్పుడీ 'ఏమయ్యిందో ఏమిటో' పాటలో హీరోయిన్ పాయల్ జీవితంలో ప్రేమను చూపించారు.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు వచ్చాయి. త్వరలో ట్రైలర్ విడుదల తేదీ వెల్లడిస్తాం. నవంబర్ 17న భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తాం'' అని నిర్మాతలు చెప్పారు.

చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ''ఇదొక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అందులో లవ్ కూడా ఒకటి. అజనీష్ లోక్‌నాథ్ మంచి మెలోడీ అందించారు. అంతే అందంగా పిక్చరైజ్ చేశాం. ఈ సాంగ్ తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా'' అని చెప్పారు.