టీడీపీ మీద తమ్మినేని సంచలన కామెంట్స్?

తెలుగుదేశం పార్టీ పుట్టు పూర్వోత్తరాలు, గోత్రనామాలూ అన్నీ తెలిసిన వారు శాసనసభాపతి తమ్మినేని సీతారాం. ఆ పార్టీలో మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయనకు ఉంది. ప్రత్యేకించి చంద్రబాబు ఏలుబడి ఏంటో కూడా కళ్ళారా…

తెలుగుదేశం పార్టీ పుట్టు పూర్వోత్తరాలు, గోత్రనామాలూ అన్నీ తెలిసిన వారు శాసనసభాపతి తమ్మినేని సీతారాం. ఆ పార్టీలో మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయనకు ఉంది. ప్రత్యేకించి చంద్రబాబు ఏలుబడి ఏంటో కూడా కళ్ళారా చూసిన తమ్మినేని పసుపు పార్టీ లోగుట్టు అంతా ఎప్పటికపుడు బట్టబయలు చేస్తూనే ఉంటారు.

తాజాగా ఆయన టీడీపీ మీద సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని  ప్రజల మంచి కోసం జగన్మోహనరెడ్డి  ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా దానికి మోకాలడ్డి బ్రేకులు వేసే పార్టీ టీడీపీ అంటూ ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదువులు పెడతామంటే కోర్టుకెళ్ళిన చరిత్ర టీడీపీది అని సెటైర్లు వేశారు. పేదలకు ఇళ్ళు పంచుతామన్నా కూడా కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నది కూడా టీడీపీనే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంచి పనులు చేస్తే  అడ్డుకోవడం టీడీపీకి అలవాటు అయిందని కూడా ఆయన అన్నారు. ఇదిలా ఉండగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక   ప్రభుత్వ పాఠశాలల‌ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని తమ్మినేని అన్నారు. 

ఇపుడు సర్కార్ బడులలో చదువుకోవాలన్న ఆసక్తి విద్యార్ధులకు బాగా పెరిగిందని, తల్లిదండ్రులు కూడా అక్కడికే తమ పిల్లలను  పంపుతున్నారంటే అది జగన్ సాధించిన విజయమేనని తమ్మినేని అంటున్నారు.

మ‌రో జోస్యం వ‌దిలిన స‌బ్బం