శరత్ బాబు.. మళ్లీ అవే పుకార్లు

ఎవరికైనా ఏమాత్రం అనారోగ్యంగా అనిపిస్తే చాలు, అతడు చనిపోయాడంటూ ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. మొన్నటికిమొన్న సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారంటూ కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. వాటిని ఆయన స్వయంగా ఖండించారు. బతికుండగానే…

ఎవరికైనా ఏమాత్రం అనారోగ్యంగా అనిపిస్తే చాలు, అతడు చనిపోయాడంటూ ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. మొన్నటికిమొన్న సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారంటూ కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. వాటిని ఆయన స్వయంగా ఖండించారు. బతికుండగానే తనను చంపేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు శరత్ బాబుపై కూడా అవే తరహా కథనాలు.

సీనియర్ నటుడు శరత్ బాబు, కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అంతలోనే ఆయన మరణించారంటూ కొన్ని తమిళ వెబ్ సైట్స్, మరికొన్ని తెలుగు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించడం మొదలుపెట్టాయి.

వీటిపై శరత్ బాబు సోదరి సీరియస్ అయ్యారు. అన్నయ్య క్షేమంగానే ఉన్నారని స్పష్టం చేసిన ఆవిడ.. శరత్ బాబు తాజా ఆరోగ్య పరిస్థితిని కూడా వెల్లడించారు.

హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శరత్ బాబు, తాజాగా కోలుకున్నారట. ఆయన్ని ఐసీయూ నుంచి రూమ్ కు షిఫ్ట్ చేశారట. తొందరలోనే ఆయన కోలుకొని, మీడియాతో కూడా మాట్లాడతారని ఆయన సోదరి ఓ ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని నమ్మొద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.