చైతూ, అల్లరి నరేష్, గోపీచంద్.. తగ్గేదేలే!

తెలుగు సినిమాల ప్రచార సరళి పూర్తిగా మారిపోయింది. ఒకప్పట్లా యాడ్స్ ఇచ్చామా, ఇంటర్వ్యూలు చేశామా, చేతులు దులుపుకున్నామా అన్నట్టు లేదు వ్యవహారం. ప్రేక్షకలకు దగ్గరవ్వడానికి కొత్త కొత్త ఆలోచనలతో వస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం రిలీజ్…

తెలుగు సినిమాల ప్రచార సరళి పూర్తిగా మారిపోయింది. ఒకప్పట్లా యాడ్స్ ఇచ్చామా, ఇంటర్వ్యూలు చేశామా, చేతులు దులుపుకున్నామా అన్నట్టు లేదు వ్యవహారం. ప్రేక్షకలకు దగ్గరవ్వడానికి కొత్త కొత్త ఆలోచనలతో వస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అయిన 3 సినిమాల ప్రమోషన్స్ చూస్తుంటే ఎవరికైనా ముచ్చటేస్తుంది.

అల్లరి నరేష్ కొత్త సినిమా ఉగ్రం. అన్ని సినిమాల్లానే ఈ సినిమాకు కూడా ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లాంటివి పెట్టారు. వీటితో పాటు సరికొత్త ప్రచారం స్టార్ట్ చేశారు. టిక్ టాక్ తరహాలో హీరోలతో వీడియోలు తయారుచేసి వదులుతున్నారు. ఇది మంచి బజ్ తెచ్చింది.

దీనికోసం తన సర్కిల్ మొత్తాన్ని వాడుతున్నాడు అల్లరి నరేష్. అడివి శేష్, నిఖిల్, విశ్వక్ సేన్, సందీప్ కిషన్.. ఇలా యంగ్ హీరోస్ అందర్నీ లైన్లో పెట్టాడు. వాళ్లు చేసే వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఉగ్రంకు మంచి ప్రచారం తెచ్చిపెడుతున్నాయి. ఈ విషయంలో షైన్ స్క్రీన్ బ్యానర్ చొరవను కూడా మెచ్చుకోవాల్సిందే.

ఇటు నాగచైతన్య కూడా తగ్గట్లేదు. తన సినిమా కస్టడీ ప్రచారం కోసం ఏకంగా క్షేత్రస్థాయి పర్యటనలు షురూ చేశాడు చైతూ. మొన్నటికిమొన్న పాతబస్తీ, చార్మినార్ ఏరియాస్ చుట్టేశాడు. చాయ్ తాగడంతో పాటు, కొన్ని కొత్త రుచులు టేస్ట్ చేశాడు. త్వరలోనే హీరోయిన్ కృతి శెట్టితో కలిసి కొత్త తరహాలో గ్రౌండ్ లెవెల్ ప్రచారం స్టార్ట్ చేయబోతున్నాడు. మరోవైపు ఇంటర్వ్యూలు కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు.

రామబాణం యూనిట్, ప్రచారం విషయంలో కాస్త కొత్తగా ఆలోచించింది ఏదైనా ఉందంటే అది తేజతో ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం ఒక్కటే. ఆ ఒక్క ఇంటర్వ్యూతో సినిమాపై బజ్ బాగా పెరిగింది. అయితే ఆ తర్వాత ఆ కొత్తదనాన్ని కొనసాగించలేకపోయారు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేయడం, బోలెడన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడంతోనే సరిపెడుతున్నారు. ఈ 2 రోజుల్లో వాళ్లు కొత్తగా ఏం చేస్తారనేది చూడాలి.

మొత్తమ్మీద తమ సినిమాలకు ప్రచారం కల్పించడంలో టాలీవుడ్ మేకర్స్, హీరోలు కొత్తకొత్త పద్ధతులు ఫాలో అవుతున్నారు. ఆడియన్స్ కు మరింత దగ్గరవుతున్నారు.