మహాత్మాగాంధీ మనవడు కన్నుమూత!

మ‌హాత్మా గాంధీ మ‌నువ‌డు అరుణ్ గాంధీ(89) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్ లో తుదిశ్వాస విడిచారు. ఈ మేర‌కు అరుణ్ గాంధీ కుమారుడు తుషార్ గాంధీ ట్విట్ట‌ర్ వేదిక‌గా…

మ‌హాత్మా గాంధీ మ‌నువ‌డు అరుణ్ గాంధీ(89) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్ లో తుదిశ్వాస విడిచారు. ఈ మేర‌కు అరుణ్ గాంధీ కుమారుడు తుషార్ గాంధీ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. 

మహాత్మాగాంధీ కొడుకైన మణిలాల్ గాంధీ కొడుకే ఈ అరుణ్ గాంధీ. ఈయన దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్ లో 1934 ఏప్రిల్‌ 14న మణిలాల్ గాంధీ, సుశీలా మష్రూవాలా దంపతులకు జ‌న్మించారు. రచయిత, సామాజిక-రాజకీయ కార్యకర్తగా అందరికి సుపరిచితం. ఆయనకు కుమారుడు తుషార్, కుమార్తె అర్చనతో పాటు నలుగురు మనవళ్లు, ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు.

1982లో తన తాత జీవితం ఆధారంగా తీసిన చిత్రానికి 25 మిలియన్ డాలర్లు సబ్సిడీ ఇచ్చిన తర్వాత భారత ప్రభుత్వాన్ని ఒక వ్యాసంలో విమర్శించారు.