మాజీ మంత్రి వ్యాఖ్య‌ల‌పై బీజేపీ సీరియ‌స్!

కేవలం పేరుకు కాషాయ కండువా క‌ప్పుకున్న మ‌న‌సు మాత్రం ఎల్లో పార్టీ గురించే ఆలోచించే కొంత మంది బీజేపీ నేత‌ల్లో ముందు వ‌రుస‌లో ఉండే మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి తాజాగా బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన…

కేవలం పేరుకు కాషాయ కండువా క‌ప్పుకున్న మ‌న‌సు మాత్రం ఎల్లో పార్టీ గురించే ఆలోచించే కొంత మంది బీజేపీ నేత‌ల్లో ముందు వ‌రుస‌లో ఉండే మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి తాజాగా బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పొత్తుల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ అధిష్టానం సీరియ‌స్ అయిన‌ట్లు తెలుస్తోంది. 

ఓ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తాయ‌ని, ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ అధిష్టానం ఆగ్ర‌హం వ్యక్తం చేసిన‌ట్లు స‌మాచారం. పార్టీ లైన్ కు వ్య‌తిరేకంగా మాట్లాడినందుకు నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

ఒక‌వైపు తాము జ‌న‌సేన‌తో మాత్ర‌మే పొత్తులో ఉన్నామ‌ని, టీడీపీతో క‌లిసి వెళ్లేది లేద‌ని బీజేపీ ఆగ్ర‌నేత‌లు చెబుతున్నా.. బీజేపీలోని చంద్ర‌బాబు వ‌ర్గం నేత‌లు మాత్రం టీడీపీతో క‌ల‌వ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. 

కాగా ఆదినారాయ‌ణ రెడ్డి గ‌తంలో వైసీపీ పార్టీ నుండి గెలిచి మంత్రి ప‌ద‌వి కోసం టీడీపీలో చేరిన విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో కడ‌ప ఎంపీగా టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన ఆయ‌న‌ త‌ర్వాత బీజేపీకి వెళ్లారు. నిత్యం బీజేపీ భ‌జ‌న కంటే చంద్ర‌బాబు భ‌జ‌న చేసే వ్య‌క్తిగా ఆదినారాయ‌ణ రెడ్డి బీజేపీలో కొన‌సాగుతున్నారు.