‘ఆడవాళ్ల’ అదృష్టం బాగుంది

టాలీవుడ్ లో ఒక విధంగా స్వర్ణయుగం నడుస్తోంది. నాన్ థియేటర్ హక్కుల రేట్లు మాంచి ఊపు మీద వున్నాయి. పక్కాగా ప్లాన్ చేసుకుని, మంచి ప్రాజెక్ట్ లు టేకప్ చేస్తే డబ్బులే డబ్బులు.  Advertisement…

టాలీవుడ్ లో ఒక విధంగా స్వర్ణయుగం నడుస్తోంది. నాన్ థియేటర్ హక్కుల రేట్లు మాంచి ఊపు మీద వున్నాయి. పక్కాగా ప్లాన్ చేసుకుని, మంచి ప్రాజెక్ట్ లు టేకప్ చేస్తే డబ్బులే డబ్బులు. 

లేదూ ఏదో ఒకటి చేసేద్దాం…అనుకుంటే మాత్రం నష్టాలే. అయితే నాన్ థియేటర్ హక్కులు పెరగడంతో హీరోలు కూడా రేట్లు పెంచేసి, లాగేస్తున్నారు. బడ్ఙెట్ లు పెంచేస్తున్నారు. అది వేరే సంగతి. 

ఇంతకీ ఇప్పుడు విషయం ఏమిటంటే శర్వానంద్ సినిమా ఆడవాళ్లూ మీకు జోహార్లు. త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా నాన్ థియేటర్ బిజినెస్ దగ్గర దగ్గర 25 కోట్లకు సింగిల్ బయ్యర్ కు మార్కెట్ అయిపోయింది. 

థియేటర్ల మీద 20 కోట్ల వరకు వచ్చింది. ఒక్క ఆంధ్రనే 9 కొట్ల రేషియోలో విక్రయంచారు. అందులోనూ ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఫన్ ఙోనర్. మామూలుగానే శర్వానంద్ లేడీస్ టచ్ వున్న సబ్ఙెక్ట్ లు, క్లాస్ సబ్ఙెక్ట్ లు తీసుకుంటే క్రేఙ్  వుంటుంది. సినిమాలో రష్మిక-శర్వానంద్ ఙోడీగా వుండడంతో ఈ ఙోడీకి మరింత క్రేఙ్ వచ్చింది.  హీందీ డబ్బింగ్ రైట్స్, డిజిటల్ రైట్స్ బాగా పలికాయని తెలుస్తోంది.

శర్వానంద్ సినిమాకు ఈ టైమ్ లో ఈ రేంజ్ లో మార్కెట్ కావడంతో మంచి టేబుల్ ప్రాఫిట్ తో సినిమా విడుదలవుతోంది. ప్రస్తుతం శర్వానంద్ ఆచితూచి ప్రేక్షకుల అభిరుచులకు, తన ఫ్యాన్స్ తనను ఎలా చూడాలి అనుకుంటున్నారన్నది దృష్టిలో వుంచుకుని కథలు ఎంచుకుంటున్నాడు. అలాంటి కథతో తయారవుతోంది ఆడవాళ్లూ మీకు ఙోహార్లు.