40 ఏళ్ల పాటు తాడిపత్రిని తమ తన గుప్పెట్లో పెట్టుకొని పెత్తనం చెలాయించిన జేసీ ఫ్యామిలీ గత ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం వార్తల్లో నిలవడానికి రకరకాల విన్యాసాలు చేస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాటల ద్వారా రెచ్చిపోయే జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారం పోయిన తర్వాత తన యాక్టింగ్ కి పని చెప్పారు. నారా లోకేష్ పాదయాత్ర చూసి కన్నీళ్లు పెట్టుకొని తనలో ఉన్న నటనను బయటకు తీసిన ఆయన తాజాగా మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నిరసన పేరుతో తాడిపత్రిలో హైడ్రామా సృష్టించారు.
మున్సిపల్ కమిషనర్ కు వ్యతిరేకంగా మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట వంటావార్పు కార్యక్రమం అంటూ అంటూ నానా హంగామా సృష్టించారు. దీంతో పోలీసులు ఆయను అడ్డుకోని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయన్ను బలవంతంగా తన ఇంటికి తరలించే సమయంలో వారిపై కాళ్ళతో తన్నడం గమనార్హం.
ఇంత ముందుకు కూడా ఇసుక అక్రమ రవాణా చేసున్న వారిపై దాడులు చేస్తామని.. ఆ వాహనలకు నిప్పు పెడతామని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించడం తెలిసిందే. తను అధికారంలో ఉన్నప్పుడు తన వారితో ఇసుక విచ్చలవిడిగా అక్రమ రవాణా పాల్పడిన ఆయన వాటిపై మాట్లాడటం విడ్డూరం అంటూన్నారు వైసీపీ నేతలు. ఏది ఏమైనా గానీ ఈ మధ్య కాలంలో ప్రభాకర్ రెడ్డి మీడియాలో వార్తల కోసం మరి దిగజారి ప్రవర్తిస్తున్నారనేది నిజం అంటున్నారు తాడిపత్రి వాసులు.