పుట్టుమచ్చల ఇష్యూపై మళ్లీ స్పందించిన హీరోయిన్

టాలీవుడ్ లో 2 రోజులుగా నడుస్తున్న పుట్టుమచ్చల వివాదంపై హీరోయిన్ నేహా శెట్టి మరోసారి స్పందించింది. అయితే ఈసారి నేరుగా ఆ ఇష్యూపై స్పందించకుండా.. పరోక్షంగా మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించింది ఈ బ్యూటీ.…

టాలీవుడ్ లో 2 రోజులుగా నడుస్తున్న పుట్టుమచ్చల వివాదంపై హీరోయిన్ నేహా శెట్టి మరోసారి స్పందించింది. అయితే ఈసారి నేరుగా ఆ ఇష్యూపై స్పందించకుండా.. పరోక్షంగా మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించింది ఈ బ్యూటీ. ప్రతి ఒక్కరికి వాళ్ల సొంత అభిప్రాయాలుంటాయని, కానీ ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు హుందాగా ఉండాలనే అర్థం వచ్చేలా రియాక్ట్ అయింది.

“మనమందరం మనుషులం, ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. అయితే వాళ్ల స్పేస్ లో వాళ్లు ఉండాలి, నా స్పేస్ నాది. నేను సోషల్ మీడియాలో కామెంట్స్, ట్రోల్స్ చక్కగా హ్యాండిల్ చేయగలను. అలాంటి ట్రోల్స్ ప్రభావం నా వ్యక్తిగత జీవితం, కెరీర్ పై పడకుండా జాగ్రత్తపడతాను. నాపై వస్తున్న కామెంట్స్, ట్రోల్స్ ను ఎప్పటికప్పుడు నేను గమనిస్తుంటాను. దీని కోసం నాకు ఓ టీమ్ కూడా ఉంది. ఎవరితోనైనా పర్సనల్ గా టచ్ లో ఉండాలని, వాళ్ల కామెంట్స్ పై రియాక్ట్ అవ్వాలని నేను అనుకుంటాను. అందుకే కొన్ని ట్రోల్స్ కు నేను వ్యక్తిగతంగా స్పందిస్తాను, నా స్థాయిలో సమాధానం ఇస్తాను.”

ఇలా కామెంట్స్, ట్రోల్స్ పై స్పందించింది నేహా శెట్టి. డీజే టిల్లూ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్ లో సురేష్ కొండేటి అనే 'జర్నలిస్ట్' నేహా శెట్టి గురించి అసభ్యంగా మాట్లాడాడు. ఆమె ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలున్నాయో తెలుసుకున్నారా అంటూ హీరోను ప్రశ్నించాడు. ఈ ఇష్యూపై ఇప్పటికే సోషల్ మీడియాలో రియాక్ట్ అయింది నేహా శెట్టి. ఇప్పుడు మరోసారి తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. టాలీవుడ్ కెరీర్ ను తను చాలా సీరియస్ గా తీసుకున్నట్టు చెబుతోంది నేహా. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన నేహా శెట్టి.. ఆ సినిమా తర్వాత యూఎస్ వెళ్లి న్యూయార్క్ ఫిలిం అకాడమీలో యాక్టింగ్ కోర్స్ చేసింది. తిరిగొచ్చి గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు డీజే టిల్లూతో మరోసారి తెరపైకొస్తోంది.