పంచ్ డైలాగులతో ప్రత్యర్థులకు సవాల్ విసిరే టీపీసీసీ రేవంత్ రెడ్డి కంటతడి పెట్టారు. దీనికి ప్రధాన కారణం మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ నుండి కాంగ్రెస్కు రూ.25 కోట్లు ముట్టాయని ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలే. తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొడుతూ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేద్దామని సవాల్ విసిరిన ఆయన ఇవాళ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేసి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న తన నిజాయితీని శంకించరంటూ కంటతడి పెట్టారు.
రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో తాము ఖర్చు చేసిన ప్రతి రూపాయీ పార్టీ కార్యకర్తలు చందాల రూపంలో వచ్చేందేనని.. కేసీఆర్ తో లాలూచీ తన రక్తంలోనే లేదని.. కేటీఆర్, కేసీఆర్ అవినీతిపై పోరాటం చేసినందుకు తనను జైలు పాలు చేసిన భయపడలేదని.. నీ..మ్మ నువ్వు ఏది పడితే అది మాట్లాడితే.. మేం ఊరుకుంటమా.. నేను ఎవ్వడికి బయపడను, ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతా అని రేవంత్ ఉద్వేగాంగా మాట్లాడరు. తెలంగాణ సమాజం కోసం కొట్లాడే వ్యక్తిగా నాపై బురదజల్లడం మంచిది కాదని హితవు పలికారు.
కాగా ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా కేసీఆర్ నుంచి కాంగ్రెస్కు రూ.25 కోట్లు ముట్టాయని ఆరోపించారు. ఈటల వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపణలను తిప్పి కొడుతూ. ఇవ్వాల హైదరాబాద్లోని భాగ్యలక్షి అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారి ముందు ప్రమాణం చేశారు.