మళ్లీ అదే క్రేజీ కాంబినేషన్

దర్శకుడు పూరి జగన్నాధ్ కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ ఓ మలుపు. పూర్తిగా డౌన్ ఫాల్ లోకి వచ్చిన పూరి జగన్నాధ్ కు సూపర్ బూస్ట్ ఇచ్చిన సినిమా. హీరో రామ్ కు తిరుగులేని…

దర్శకుడు పూరి జగన్నాధ్ కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ ఓ మలుపు. పూర్తిగా డౌన్ ఫాల్ లోకి వచ్చిన పూరి జగన్నాధ్ కు సూపర్ బూస్ట్ ఇచ్చిన సినిమా. హీరో రామ్ కు తిరుగులేని హిట్. కేవలం వీళ్లు ఇద్దరికే కాదు, సంగీత దర్శకుడు మణిశర్మ కు సెకెండ్ ఇన్నింగ్స్ ఇచ్చింది. ఆ సినిమా తరువాత మణిశర్మ డజన్ల కొద్దీ సినిమాలు చేసారు. ఇలాంటి కాంబినేషన్ మళ్లీ రాబోతోంది.

దర్శకుడు పూరి జగన్నాధ్-రామ్ కాంబినేషన్ ను మరో సారి సెట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇస్మార్ట్ శంకర్ తరువాత పూరి జగన్నాధ్ లైగర్ సినిమా చేసారు. విజయ్ దేవరకొండ-అనన్యపాండే కాంబినేషన్ లో తయారైన ఈ భారీ సినిమాకు భారీ బజ్ వచ్చింది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలయింది.కానీ అనుకున్న మేరకు ఆడలేదు. దాంతో పూరి జగన్నాధ్ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

అప్పటి నుంచి ముంబాయి లోనే వుండిపోయారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా అని వినిపించింది కానీ ఏ మేరకు ముందుకు వెళ్లిందో తెలియదు. కానీ ఈలోగా ఇస్మార్ట్ రామ్ తోనే ఓ సినిమా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పూరి-చార్మి బ్యానర్ పిసి కనెక్ట్స్ పతాకం మీదే ఈ సినిమా వుంటుందని తెలుస్తోంది.  ఈ మేరకు ప్రాధమిక చర్చలు పూర్తయ్యాయి. అన్నీ కుదిరితే బోయపాటి-రామ్ సినిమా తరువాత ఇదే వుంటుందని తెలుస్తోంది.

పూరి సినిమా కోసం వేచి చూసే ఫ్యాన్స్ చాలా మందే వున్నారు. ఫ్లాప్ లు హిట్ లతో సంబంధం లేకుండా ఆయన తో సినిమాలు చేయాలనుకునే హీరోలు వున్నారు. నిర్మాతలు వున్నారు. అయితే ఈసారి కాస్త ఆర్థిక లావాదేవీలు కూడా అడ్డం పడడంతో లైగర్ సినిమా తరువాత కాస్త లేటయింది.