ఎల్లో మీడియాధిపతి వైఖరి చంద్రబాబు తల్లిదండ్రుల్ని బజారుకీడ్చేలా చేసింది. సీఎం వైఎస్ జగన్పై విపరీతమైన ద్వేషాన్ని నింపుకున్న ఆ మీడియాధిపతి …ఆయనపై నిత్యం విషపు రాతలు రాస్తూనే వుంటారు. తాజాగా తల్లి విజయలక్ష్మికి చెల్లి షర్మిల కంటే ఆలస్యంగా వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం… సదరు అంధ పత్రిక యజమాని దృష్టిలో నేరమైంది.
చెల్లి షర్మిల శుభాకాంక్షలు చెప్పిన తర్వాత కూడా సైలెంట్గా ఉంటే బాగోదని మధ్యాహ్నం 2.11 గంటలకు ‘హ్యాపీ బర్త్డే అమ్మా’ అని జగన్ ఒక ట్వీట్ చేశారంటూ రాసుకొచ్చారు. ఈ రాతలపై నెటిజన్లు తమదైన సృజనాత్మక విమర్శలతో ఎల్లో మీడియాధిపతిని ఉతికి ఆరేయడం విశేషం.
అయ్యా ఎల్లో మీడియాధిపతి గారూ… చంద్రబాబు తల్లిదండ్రుల పుట్టిన రోజు వేడుకలను నిర్వహించిన వీడియో ఒక్కటైనా షేర్ చేయాలంటూ నెటిజన్లు నిలదీయడం గమనార్హం. తమ ఆరాధ్య నాయకుడికి రాజకీయ ప్రయోజనాలు తప్ప, తల్లిదండ్రులు అవసరం లేదని చెప్పదలుచుకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇదే సందర్భంలో అల్జీమర్స్తో బాధపడుతున్న తమ్ముడు రామ్మూర్తినాయుడి బాగోగులు చంద్రబాబునాయుడు పట్టించుకుంటే చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. రామ్మూర్తినాయుడితో కలిసి కలిసి స్కూల్కి వెళ్ళిన, కబడ్డీ ఆడుతున్న, రంగులు జల్లుకుంటున్న ఫొటోలను షేర్ చేయాలంటూ నెటిజన్లు దెప్పి పొడిచారు.
అలాగే ఎన్టీఆర్ చిత్రపటం ముందు చంద్రబాబు కూచుని భక్తితో, పరవశంతో ధ్యాననిమగ్నుడై ఉన్న ఫొటో చూపాలని వెటకారంతో కూడిన ప్రశ్నలతో నెటిజన్లు నిలదీయడం ఆలోచింపచేస్తున్నాయి. ఇదంతా ఎల్లో మీడియాధిపతి అత్యుత్సాహంతో చేసిన పనే చంద్రబాబు తల్లిదండ్రులను బజారుకీడ్చేలా చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.