మళ్లీ రష్మిక.. విజయ్- ఈసారి రెండు భాగాలు

సెలబ్రిటీ క్రేజీ పెయిర్ విజయ్ దేవరకొండ-రష్మిక మడొన్నా మరోసారి కలిసి నటిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరు కలిసి నటిస్తారని వార్తలు వినిపిస్తూనే వున్నాయి. అయితే అది ఏ బ్యానర్ సినిమా అన్నది కన్…

సెలబ్రిటీ క్రేజీ పెయిర్ విజయ్ దేవరకొండ-రష్మిక మడొన్నా మరోసారి కలిసి నటిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరు కలిసి నటిస్తారని వార్తలు వినిపిస్తూనే వున్నాయి. అయితే అది ఏ బ్యానర్ సినిమా అన్నది కన్ ఫర్మ్ కాలేదు. ఈ లోగా దిల్ రాజు సెట్ మీదకు వెళ్లిపోయింది. 

మైత్రీ మూవీస్ నిర్మించే రవితేజ సినిమాకు రష్మిక ఫిక్స్ అయింది. శ్రీలీల పేరు సితార సంస్థ సినిమాకు వినిపించింది, దీంతో మళ్లీ మరోసారి విజయ్-రష్మిక పెయిర్ ఇప్పుడే వుండదేమో అన్న అనుమానం వచ్చేసింది.

ఇలాంటి నేపథ్యంలో శ్రీలీల కు డేట్ లు కుదరక రెండు సినిమాలు వదలుకుంది. అందులో ఒకటి సితార సంస్థ-గౌతమ్ తిన్ననూరి నిర్మించే సినిమా. ఇప్పుడు ఆ సినిమాకు రష్మికను ఫైనల్ చేసారు. నిజానికి మొదట్లోనే రష్మికను తీసుకుందాం అని మేకర్లు ప్రపోజ్ చేసారు. విజయ్ ఎస్.. నో చెప్పలేదు. దాంతో శ్రీలీల వైపు మొగ్గారు. కానీ ఇప్పుడు ఆఖరికి రష్మిక ఫైనల్ అయింది.

ఇంకో విశేషం ఏమిటంటే తొలిసారిగా విజయ్ దేవరకొండ రెండు భాగాల సినిమా చేయబోతున్నాడు. అవుట్ అంట్ అవుట్ యాక్షన్ సినిమాగా గౌతమ్ తిన్ననూరి సబ్జెక్ట్ ను తయారు చేసుకున్నారు. కానీ దానికి ఒక భాగం సరిపోదు. అందుకే రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడే తెలుగు హీరోలు ఒక్కొక్కరు రెండు భాగాల సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ వంతు వచ్చింది.