హత్య చేసి శవంతో కలిసి పడుకున్నాడు

మనుషులు ఎంత పైశాచికంగా మారుతున్నారనడానికి మరో ఉదాహరణ ఉంది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. హైదరాబాద్ శివార్లలోని లంగర్ హౌజ్ లో ఉంటున్న ఎల్లప్ప ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇంతకీ…

మనుషులు ఎంత పైశాచికంగా మారుతున్నారనడానికి మరో ఉదాహరణ ఉంది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. హైదరాబాద్ శివార్లలోని లంగర్ హౌజ్ లో ఉంటున్న ఎల్లప్ప ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇంతకీ ఇతడు హత్య చేసింది ఎవర్నో తెలుసా? సాక్ష్యాత్తూ తన భార్యనే.

లంగర్ హౌజ్ లోని మందుల బస్తీలో కొన్నేళ్లుగా ఎల్లప్ప, అమృతమ్మ దంపతులు ఉంటున్నారు. ఎల్లప్ప రోజువారీ కూలి. రోజూ తాగొచ్చి ఇంట్లో గొడవ పడుతుంటాడు. భార్యాభర్తల మధ్య ఇప్పటికే చాలా గొడవలయ్యాయి. కొన్నిసార్లు వివాదం పంచాయితీ వరకు కూడా వెళ్లింది. అయితే మంగళవారం రాత్రి మాత్రం ఈ వ్యవహారం హద్దులు దాటింది.

ఎప్పట్లానే ఆరోజు కూడా తాగి ఇంటికొచ్చాడు ఎల్లప్ప. భార్యతో గొడవ పడ్డాడు. కానీ వివాదం అక్కడితో ఆగలేదు. తాగిన మైకంలో అమృతమ్మ గొంతు నులుమేశాడు. ఇంట్లో ఉన్న చిన్న గ్యాస్ సిలిండర్ తీసుకొని ఆమె తలపై కొట్టాడు. దీంతో అక్కడికక్కడే ఆమె మరణించింది.

అప్పటికీ ఎల్లప్పకు తాగిన మత్తు దిగలేదు. ఆమె మృతదేహం పక్కనే రాత్రంతా పడుకున్నాడు. పొద్దున్న తాగినదంతా దిగిన తర్వాత తాపీగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఎల్లప్పకు ఆల్రెడీ నేరప్రవృత్తి ఉంది. కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగిన ఓ వ్యక్తి మర్డర్ కేసులో ఇతడు కీలక నిందితుడు. అప్పట్నుంచి కనిపించకుండా పోయిన ఎల్లప్ప, తాజాగా భార్యను హత్య చేసి పోలీసుల ముందు లొంగిపోయాడు.

కోరి తెచ్చుకుంటే కాళ్ళు విరగొట్టారు కదా ? 

కండిషన్స్ అప్లై