‘చంద్రబాబు చావు’ పేరుతో లోకేష్ కుటిల రాజకీయం!

చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన వందల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణంలో నిందితుడిగా ఏ ముహూర్తాన అరెస్టు అయ్యారో గానీ.. ఆయన అరెస్టు ద్వారా వీలైనంత ఎక్కువ రాజకీయ ప్రయోజనాలను…

చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన వందల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణంలో నిందితుడిగా ఏ ముహూర్తాన అరెస్టు అయ్యారో గానీ.. ఆయన అరెస్టు ద్వారా వీలైనంత ఎక్కువ రాజకీయ ప్రయోజనాలను పిండుకోవాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. 

ఒకవైపు చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో  రిమాండ్ ఖైదీగా ఉండగా.. ఆయనకు బయలు కావాలని న్యాయస్థానంలో దావాలు నడుపుతున్న  తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా గగోలు చేయడంలో మాత్రం ముందుంది.

సాధారణంగా కుటిల రాజకీయాలు ప్రదర్శించే వారిని.. శవరాజకీయాలు చేస్తున్నారని ప్రత్యర్ధులు విమర్శిస్తుంటారు. తమ పార్టీకి చెందిన ఎవరైనా చనిపోతే, ఆ విషయాన్ని రాద్ధాంతం చేసే రాజకీయ ప్రయోజనం పొందడానికి వక్రమార్గాలలో ప్రయత్నిస్తే ఇలాంటి విమర్శలు వినిపిస్తుంటాయి. 

ఇప్పుడు నారా లోకేష్ కూడా అలాంటి కుటిల రాజకీయానికే  దిగజారుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయనకు ప్రత్యేకంగా స్నేహ బ్లాక్ కేటాయించి, కోర్టు ఆదేశాల మేరకు ఆదనపు వసతులు కూడా కల్పించారు. నిజానికి జెడ్ కేటగిరి భద్రత కలిగి ఉన్న సీనియర్ నాయకుడు కావడం వలన, చంద్రబాబు నాయుడుకు జైల్లో కూడా అదనపు భద్రత ఏర్పాటు చేశారు. అయినా సరే చంద్రబాబు నాయుడుకు జైలులో ప్రమాదం పొంచి ఉన్నదని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తూ గోల చేస్తుండడం గమనార్హం.

ఇటీవల ములాఖత్ లో ఆయనను కలసిన యనమల రామకృష్ణుడు.. చంద్రబాబుకు జైల్లో వసతుల లేమి గురించి ప్రస్తావించారు. ఆయన ఉన్న బ్లాక్‌లో ఫ్యాన్ కూడా సరిగా తిరగడం లేదని, విపరీతంగా దోమలు కుడుతున్నాయని యనమల పేర్కొన్నారు. ఈ దోమల సమస్యను నారా లోకేష్ జాతీయ సమస్యగా మారుస్తున్నారు. 

దోమల సమస్యతో ముడి పెడుతూ, చంద్రబాబు నాయుడుని జైల్లోనే అంతం చేయడానికి .. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని లోకేష్ ట్వీట్ చేయడం విశేషం. రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఒక వ్యక్తి డెంగ్యూ బారినపడి మరణించిన వైనాన్ని లోకేష్ గుర్తు చేస్తున్నారు. 

చంద్రబాబుకు ప్రమాదం ఉన్నదని ఎవరైనా ఆరోపిస్తే గనుక.. ప్రత్యర్ధులు ఏమైనా దాడి చేయిస్తారేమో అని సహజంగా అనుకుంటారు. కానీ దోమలతో కుట్టించడం ద్వారా చంద్రబాబు నాయుడుని చంపించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా లోకేష్ ఆరోపణలు ఉండడమే తమాషా. నారా లోకేష్ వెరీ ఇంకాస్త ముదిరితే.. రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్న దోమలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దోమలు అని ఆరోపించగలరని జనం నవ్వుకుంటున్నారు.  

చంద్రబాబు నాయుడును దోమల ద్వారా చంపేయబోతున్నారు అనే మాటల ద్వారా.. ఆయన చావు పేరుతో రాజకీయ మైలేజి కోరుకుంటున్నట్లుగా కనిపిస్తున్నదని ప్రజలు విమర్శిస్తున్నారు.