ఇంకా ఐసీయూలోనే హీరో రాజశేఖర్

కరోనా బారిన పడిన హీరో రాజశేఖర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగానే ఉంది. కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. ట్రీట్ మెంట్ కు రాజశేఖర్…

కరోనా బారిన పడిన హీరో రాజశేఖర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగానే ఉంది. కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. ట్రీట్ మెంట్ కు రాజశేఖర్ సహకరిస్తున్నారని, ఓ బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని డాక్టర్లు ప్రకటించారు.

మరోవైపు ఇదే హాస్పిటల్ లో కరోనాతో జాయిన్ అయిన రాజశేఖర్ భార్య జీవితకు ట్రీట్ మెంట్ పూర్తయిందని వైద్యులు ప్రకటించారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు నెగెటివ్ రావడంతో, ఈరోజు జీవిత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

తనతో పాటు భార్య జీవిత, కూతుళ్లు శివానీ, శివాత్మిక కరోనా బారిన పడిన విషయాన్ని రాజశేఖర్ స్వయంగా ప్రకటించారు. రాజశేఖర్ కుటుంబానికి కరోనా సోకిందనే విషయం బయటకొచ్చే సమయానికే శివానీ, శివాత్మిక పూర్తిగా కోలుకున్నారు.

ఈరోజు జీవిత కూడా డిశ్చార్జ్ అయ్యారు. మరి కొన్ని రోజుల్లో రాజశేఖర్ కూడా పూర్తి ఆరోగ్యంతో కోలుకునే అవకాశం ఉంది.లెక్కప్రకారం ఈపాటికి నీలకంఠ దర్శకత్వంలో సెట్స్ పై ఉండాలి రాజశేఖర్. ఊహించని విధంగా కరోనా సోకడంతో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది. 

అది బిహార్‌ కోసమే రిజర్వ్‌ చేశారట