న్యూ ఇయర్ పార్టీస్.. తారలంతా గప్ చుప్

నూతన సంవత్సర వేడుకల కోసం తారలంతా 2 నెలల ముందు నుంచే ప్రిపేర్ అవుతుంటారు. మంచి డెస్టినేషన్ పార్టీ సెట్ చేసుకుంటారు. మరికొంతమంది తారలు, డిసెంబర్ 31 రాత్రి జరిగే పార్టీల్లో డాన్స్ చేసేందుకు…

నూతన సంవత్సర వేడుకల కోసం తారలంతా 2 నెలల ముందు నుంచే ప్రిపేర్ అవుతుంటారు. మంచి డెస్టినేషన్ పార్టీ సెట్ చేసుకుంటారు. మరికొంతమంది తారలు, డిసెంబర్ 31 రాత్రి జరిగే పార్టీల్లో డాన్స్ చేసేందుకు కోట్ల రూపాయలు తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం ఎక్కడి తారలు అక్కడ గప్ చుప్. అంతా ఒమిక్రాన్-కరోనా మయం, ఎటు చూసినా ఆంక్షల వలయం. దీంతో సెలబ్రిటీలంతా సైలెంట్ అయ్యారు.

ప్రతి న్యూ ఇయర్ పార్టీలో డాన్స్ చేయడానికి కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తుంటారు జాక్వెలిన్, కత్రినాకైఫ్ లాంటి తారలు. కానీ ఈసారి మాత్రం కత్రినాకైఫ్ నుంచి అలాంటి హంగామా లేదు. ఎందుకంటే, ఆమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం భర్త విక్కీ కౌశల్ తో కలిసి మాల్దీవుల్లో ఉంది. హనీమూన్ అయినా, న్యూ ఇయర్ పార్టీ అయినా అన్నీ అక్కడే.

ఇక న్యూ ఇయర్ పార్టీల్లో రెగ్యులర్ గా డాన్స్ చేసే మరో ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా పార్టీలకు దూరంగా ఉంది. ఓవైపు కరోనా భయం వెంటాడుతుంటే, మరోవైపు జాక్వెలిన్ ను ఈడీ కేసులు వెంటాడుతున్నాడు. దీంతో ఆమె ఈ ఏడాది పార్టీలకు దూరంగా ఉంది. ఇప్పటికే అందుకున్న బహుమతులకు లెక్కలు చెప్పలేక ఇబ్బంది పడుతున్న జాక్వెలిన్, ఈ రాత్రి అందుకోబోయే బహుమతులకు కూడా లెక్కలు చెప్పాల్సి వస్తుందని భయపడినట్టుంది.

ఇక మొన్నటివరకు భార్యాభర్తలుగా ఉన్న నాగచైతన్య-సమంత.. తమ ప్రతి న్యూ ఇయర్ వేడుకకు గోవా వెళ్లేవారు. వాళ్లిద్దరికీ కామన్ గా నచ్చే హాలిడే స్పాట్ అది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. సమంత-నాగచైతన్య విడిపోయారు. దీంతో సమంత మాత్రమే గోవా వెళ్లింది. నాగచైతన్య మాత్రం ఇంటికే పరిమితమయ్యాడు.

మరో జంట నయనతార-విఘ్నేష్ కూడా ప్రతి న్యూ ఇయర్ కు విదేశాలకు వెళ్లేవారు. కానీ ఈసారి మాత్రం చెన్నైలోనే ఉండిపోయారు. అటు కరీనా కపూర్ కూడా ముంబయిలోనే తన నివాసానికి పరిమితమైంది. రీసెంట్ గా కరోనా నుంచి కోలుకున్న ఈ బ్యూటీ.. అన్ని రకాల పార్టీల్ని రద్దు చేసుకుంది.

శ్రియ మాత్రం తన రష్యా భర్తతో కలిసి గోవాలో ల్యాండ్ అయిపోయింది. ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఆ వీడియోలు, ఫొటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది. అటు అనన్య పాండే కూడా ఈ న్యూ ఇయర్ కు ముంబయిలోనే ఉండిపోయింది. ప్రతి న్యూ ఇయర్ ను ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకునే ఎన్టీఆర్, రామ్ చరణ్.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో తీరికలేకుండా ఉన్నారు. ఈ ఒక్క నైట్ మాత్రం వీళ్లు కుటుంబానికి కేటాయించబోతున్నారు. అది కూడా తమ తమ ఇళ్లలోనే.