మహేష్ ఎక్కడుంటే ఈ దర్శకుడు అక్కడే!

సినిమా తర్వాత మహేష్ ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేది కుటుంబానికే. ఎక్కడికి వెళ్లినా కుటుంబ సభ్యుల్ని వెంటేసుకొని వెళ్లడం మహేష్ కు ఇష్టం. పైగా ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్ కాబట్టి సితార, గౌతమ్, నమ్రతతో…

సినిమా తర్వాత మహేష్ ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేది కుటుంబానికే. ఎక్కడికి వెళ్లినా కుటుంబ సభ్యుల్ని వెంటేసుకొని వెళ్లడం మహేష్ కు ఇష్టం. పైగా ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్ కాబట్టి సితార, గౌతమ్, నమ్రతతో కలిసి దుబాయ్ లో ల్యాండ్ అయిపోయాడు మహేష్. అయితే వీళ్లతో పాటు మరో కుటుంబం కూడా అక్కడ వాలిపోయింది. అదే వంశీ పైడిపల్లి కుటుంబం.

ఈమధ్య కాలంలో మహేష్ ఎక్కడుంటే వంశీ పైడిపల్లి అక్కడ ఉంటున్నాడు. వీళ్లిద్దరు మాత్రమే కాదు, ఈ రెండు కుటుంబాలు కూడా బాగా కలిసిపోయాయి. ఈ విషయాన్ని గతంలో వంశీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో కూడా మహేష్ తో కలిసిపోయాడు వంశీ పైడిపల్లి. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై నుంచి దిగిన ఫోటోల్ని షేర్ చేశాడు.

మహేష్ తో వంశీ పైడిపల్లి తీసింది ఒకే ఒక్క సినిమా. అదే మహర్షి. ఆ మూవీ బ్రేక్ ఈవెన్ అయిందా, కాస్ట్ ఫెయిల్యూర్ అయిందా అనే చర్చను పక్కనపెడితే.. మహేష్ తో మరో మూవీ చేయడానికి రెడీ అయ్యాడు పైడిపల్లి. అయితే ఆ కథను మహేష్ రిజెక్ట్ చేశాడని, అప్పట్నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందంటూ చాలా పుకార్లు వచ్చాయి.

ఆ పుకార్లపై కూడా వంశీ పైడిపల్లి స్పందించాడు. సినిమాలతో సంబంధం లేకుండా తామిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ న్యూఇయర్ వేడుకల సాక్షిగా వీళ్లిద్దరి స్నేహం ఇలా మరోసారి బయటపడింది.