ఆమే లేక‌పోయి వుంటే…నాగ‌బాబు ఎమోష‌న‌ల్‌!

మెగా బ్ర‌ద‌ర్స్‌లో నాగ‌బాబుది ప్ర‌త్యేక శైలి. త‌న అభిప్రాయాల్ని వెల్ల‌డించ‌డంలో నిక్క‌చ్చిగా ఉంటారు. రాజ‌కీయాలకు అతీతంగా త‌న‌వైన అభిప్రాయాల్ని ఏర్ప‌ర‌చుకున్నారు. కొన్ని నెల‌ల క్రితం జ‌రిగిన‌ “మా” ఎన్నిక‌ల్లో నాగ‌బాబు పోషించిన పాత్ర అంద‌రికీ…

మెగా బ్ర‌ద‌ర్స్‌లో నాగ‌బాబుది ప్ర‌త్యేక శైలి. త‌న అభిప్రాయాల్ని వెల్ల‌డించ‌డంలో నిక్క‌చ్చిగా ఉంటారు. రాజ‌కీయాలకు అతీతంగా త‌న‌వైన అభిప్రాయాల్ని ఏర్ప‌ర‌చుకున్నారు. కొన్ని నెల‌ల క్రితం జ‌రిగిన‌ “మా” ఎన్నిక‌ల్లో నాగ‌బాబు పోషించిన పాత్ర అంద‌రికీ తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్‌కు గ‌ట్టి మ‌ద్ద‌తుదారుగా నిలిచారు. 

ప్ర‌కాశ్‌రాజ్‌కు తామెందుకు మ‌ద్ద‌తు ఇవ్వాల్సి వ‌చ్చిందో ముక్కుసూటిగా చెప్పారు. అలాగే గాడ్సే గురించి ఆయ‌న గ‌తంలో చేసిన ట్వీట్ తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. నాగ‌బాబు ట్వీట్‌తో పార్టీకి సంబంధం లేద‌ని స్వ‌యంగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్పారంటే, అందులోని అంశం ఎంత ఘాటుగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

నాగ‌బాబు వ్యక్తిగ‌తంగా చాలా ఎమోష‌న‌ల్‌. తాజాగా ఆయ‌న చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. త‌న జీవిత భాగ‌స్వామి ప‌ద్మ‌జ పుట్టిన రోజు సంద‌ర్భంగా నాగ‌బాబు ఆస‌క్తిక‌ర‌, భావోద్వేగ ట్వీట్ చేశారు.

'ఈ ప్రపంచం ఎంతో కఠినమైన ప్రదేశం. నువ్వు లేకపోయుంటే ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడం మరింత కష్టమయ్యుండేది. ఎల్లప్పుడూ నాతో ఉంటూ నీ ప్రేమతో, నీ ముందుచూపుతో అసాధ్యాలను కూడా సుసాధ్యాలు చేసినందుకు కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్‌డే డియర్‌ పద్మస అంటూ శ్రీ‌మ‌తికి నాగ‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెతో కేక్‌ కట్‌ చేయించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో ఆయ‌న షేర్ చేయ‌డం విశేషం.