ప్రభాస్ ఫ్రెండ్ మాత్రమే నంట!

హమ్మయ్య ఓ క్లారిటీ వచ్చేసింది. కృతి సనన్ చెప్పేసింది. ప్రభాస్ జ‌స్ట్ తనకు ఫ్రెండ్ మాత్రమే అంటూ. మిగిలినవన్నీ గాలి వార్తలే అంటూ.  Advertisement ఇక ప్రభాస్ ఫ్యాన్స్ వదినమ్మా అంటూ పిలవడం మానేయవచ్చు.…

హమ్మయ్య ఓ క్లారిటీ వచ్చేసింది. కృతి సనన్ చెప్పేసింది. ప్రభాస్ జ‌స్ట్ తనకు ఫ్రెండ్ మాత్రమే అంటూ. మిగిలినవన్నీ గాలి వార్తలే అంటూ. 

ఇక ప్రభాస్ ఫ్యాన్స్ వదినమ్మా అంటూ పిలవడం మానేయవచ్చు. పరోక్షంగా అయినా తనకు..ప్రభాస్ కు మధ్య ఏదో వుందని అందరూ అంటూ వుంటే చాలా అంటే చాలా బాధపడ్డా అని, బాలీవుడ్ ప్రముఖుడు వరుణ్ ధావన్ కూడా ఇలాగే అంటే ప్రభాస్ తోనే చెప్పి బాధ పడ్డా అని కృతి సనన్ ఓ ఇంటర్వూలో చెప్పుకువచ్చింది.

అయితే ఏమీ లేనపుడు ప్రత్యేకంగా ప్రభాస్ కు ఎందుకు ఫోన్ చేసి చెప్పాల్సి వచ్చిందన్నది మాత్రం చెప్పలేదు. అసలు బాలీవుడ్ లో అడుగు పెడుతున్నపుడే ఇలాంటివి వుంటాయేమో అని భయపడ్డా అని, తనలాగే అందరూ భయపడతారేమో అని, భయపడినట్లే అయిందని ఇంకా ఇంకా ఏదేదో చెప్పుకువచ్చింది.

అయినా ఏ నిప్పూ లేనపుడు ఇంత వివరణ అవసరమా? బాహాటంగా ప్రభాస్-కృతిసనన్ ల మధ్య కెమిస్ట్రీని చూసి, ఫ్యాన్స్ షేర్ చేసుకున్న వీడియోలు ఎన్నో వున్నాయి. అవన్నీ కలిసే కదా ఇలాంటి వదంతులకు దారి తీసింది. బాహాటంగా అంతటి సాన్నిహిత్యం కనబడకుండా వుంటే, అసలు ఏ గొడవా లేదు కదా?