సైబర్‌ వలలో చిక్కుకున్న సీనియర్ హీరోయిన్ ..!

ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్ల బరిలో చాలా మంది అభాగ్యుల మోసపోతున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సైబర్‌ నేరగాళ్లు ఖాతాలోని సొమ్మంతా ఊడ్చేస్తారు. సామాన్యులే కాదు సెలెబ్రిటీలు కూడా సైబర్‌ మోసాలకు గురవుతున్నారు. తాజాగా…

ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్ల బరిలో చాలా మంది అభాగ్యుల మోసపోతున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సైబర్‌ నేరగాళ్లు ఖాతాలోని సొమ్మంతా ఊడ్చేస్తారు. సామాన్యులే కాదు సెలెబ్రిటీలు కూడా సైబర్‌ మోసాలకు గురవుతున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్‌ నగ్మా కేటుగాళ్ల వలలో చిక్కి మోసపోయారు.

బ్యాంకు ఖాతాకు కేవైసీ అప్‌డేట్ చేయ‌మ‌ని మెసేజ్ రావ‌డంతో అందులోని లింక్‌ని ఓపెన్ చేయ‌గానే వెంట‌నే బ్యాంక్ ఎంప్లాయ్ ను అంటూ పరిచ‌యం చేసుకున్న కేటుగాడు న‌గ్మాతో వివ‌రాలు చెప్పించుకోని ల‌క్ష రూపాయిలు ట్రాన్స్ప‌ర్ చేసుకున్నాడ‌ట‌.. కేవ‌లం ల‌క్ష రూపాయ‌ల‌తో కేటుగాడు వ‌దిలేసినందుకు న‌గ్మా బాధ‌లో సంతోషం వ్య‌క్తం చేశారు. 

న‌గ్మా మాదిరే స‌ద‌రు బ్యాంకులో దాదాపు 80 మంది ఇదే త‌ర‌హాలో మోస‌పోవడం గ‌మ‌నార్హం.  బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న .. దర్యాప్తు చేపట్టారు. కాగా టాలీవుడ్ అగ్రహీరోలతో సినిమాలలో నటించిన అతి కొద్ది అగ్ర తారల్లో నగ్మా సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్నారు.