సుకుమార్ మరో రంగస్థలం

దర్శకుడు త్రివిక్రమ్ హారిక హాసినిలో ఫిక్స్ అయిపోయినట్లు మరో దర్శకుడు సుకుమార్ మైత్రీ లో వుండిపోయేలా కనిపిస్తున్నారు. రంగస్థలం సినిమా తరువాత పుష్ప సినిమా చేసారు. ఆ పైన అదే పుష్ప సినిమా రెండో…

దర్శకుడు త్రివిక్రమ్ హారిక హాసినిలో ఫిక్స్ అయిపోయినట్లు మరో దర్శకుడు సుకుమార్ మైత్రీ లో వుండిపోయేలా కనిపిస్తున్నారు. రంగస్థలం సినిమా తరువాత పుష్ప సినిమా చేసారు. ఆ పైన అదే పుష్ప సినిమా రెండో భాగం చేయబోతున్నారు. 

దాని తరువాత రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయారు. దాంతో పాటే మైత్రీ దగ్గరే డేట్ లు వున్న మరో హీరో తో కూడా సినిమా చేస్తారని టాక్. అంటే ఈ లెక్కన మరో మూడేళ్ల వరకు సుకుమార్ మైత్రీ నుంచి బయటకు వచ్చేదే లేదు. 

రంగస్థలం సినిమా తరువాత చరణ్ రేంజ్ బాగా పెరిగింది. ఆర్ఆర్ఆర్ తో ఇంకా పెరుతుంది. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ సుకుమార్ తో సినిమా అంటే కచ్చితంగా ఆసక్తిగా వుంటుంది. సుకుమార్ మైత్రీ బంధం గట్టిగా అల్లుకుంది కాబట్టే, నిర్మాతలు కూడా రిస్క్ కు, ఖర్చుకు వెనుకాడడం లేదు.

పుష్ప సినిమా డెఫిసిట్ ను పార్ట్ 2 పూడుస్తుందని విశ్వసిస్తున్నారు. అలాగే సుకుమార్ రైటింగ్స్ టీమ్ ప్రాజెక్టులు కూడా మైత్రీ లో వున్నాయి. రాబోయే సినిమాలతో సుకుమార్ కనుక తన సత్తా మరింతగా ప్రూవ్ చేసుకుంటే మైత్రీ మూవీస్ కు ప్రభాస్ కోసం కూడా ఆయన్నే వాడేసే అవకాశం వుంది. ఇన్నాళ్లు కథ, డైరక్టర్ లేకనే ప్రభాస్ ప్రాజెక్టు వెనక్కు వెళ్తోంది. మొత్తానికి మైత్రీకి గట్టి సపోర్ట్ నే దొరికింది.