కరోనా బారిన పడిన హీరోయిన్ తమన్న

హీరోయిన్ తమన్న కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఆమె తీవ్రమైన జ్వరంతో బాధపడుతోందట. దీంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆమెను జాయిన్ చేశారు. పరీక్షలు చేసి చూడగా…

హీరోయిన్ తమన్న కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఆమె తీవ్రమైన జ్వరంతో బాధపడుతోందట. దీంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆమెను జాయిన్ చేశారు. పరీక్షలు చేసి చూడగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు ఓ న్యూస్ ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది. అయితే ఈ విషయాన్ని తమన్న ఇంకా నిర్థారించలేదు.

కొన్ని రోజుల కిందటే తమన్న తల్లిదండ్రులు (సంతోష్ భాటియా, రజనీ) కరోనా బారిన పడ్డారు. అప్పట్లో ఆ విషయాన్ని స్వయంగా తమన్న ప్రకటించింది. తన తల్లిదండ్రులకు కరోనా సోకిందని, తనకు మాత్రం నెగెటివ్ వచ్చిందని అప్పుడు చెప్పుకొచ్చింది. తమన్న పేరెంట్స్ కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పుడు ఊహించని విధంగా తమన్న కరోనా బారిన పడినట్టు వార్తలు వస్తున్నాయి.

మొన్నటివరకు ఆమె ముంబయిలోనే ఉంది. రీసెంట్ గా హైదరాబాద్ వచ్చింది. ఆహా యాప్ కోసం ఆమె ఓ షో చేసే ప్రయత్నాల్లో ఉంది. అంతలోనే కరోనా బారిన పడింది.

ప్రస్తుతం తమన్న చేతిలో సీటీమార్, గుర్తుందా శీతాకాలం సినిమాలున్నాయి. వీటితో పాటు త్వరలోనే నితిన్ హీరోగా అంధాధూన్ రీమేక్ లో కూడా ఆమె నటించాల్సి ఉంది.

జడ్జిమెంట్స్ పై నాకు ఎంతైనా మాట్లాడే హక్కుంది