వివేకా కుటుంబ స‌భ్యుల నుంచి ప్రాణ‌హాని

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి కేసులో సంచ‌ల‌నాలు చోటు చేసుకుంటూనే వున్నాయి. తాజాగా వివేకా పీఏ కృష్ణారెడ్డి త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని క‌డ‌ప ఎస్పీ అన్బురాజ‌న్‌కు ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.   Advertisement వివేకా కుమార్తె…

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి కేసులో సంచ‌ల‌నాలు చోటు చేసుకుంటూనే వున్నాయి. తాజాగా వివేకా పీఏ కృష్ణారెడ్డి త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని క‌డ‌ప ఎస్పీ అన్బురాజ‌న్‌కు ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.  

వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత‌, అల్లుడు న‌ర్రెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డితో పాటు బామ్మ‌ర్ది శివ‌ప్ర‌కాశ్‌రెడ్డిల నుంచి త‌న‌కు ప్రాణ‌హాని వుంద‌ని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో కృష్ణారెడ్డి పేర్కొన‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

వివేకా హ‌త్య కేసులో కొంద‌రు త‌న‌పై ఒత్తిడి తెస్తున్నార‌ని, ఈ నేప‌థ్యంలో వాళ్ల ముగ్గురి పేర్లు ప్ర‌స్తావిస్తూ ఎస్పీకి ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వీళ్ల వ‌ల్ల త‌న‌కు ప్రాణహాని ఉంద‌ని, ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఎస్సీని పీఏ కోరారు. 

మాజీ మంత్రి వివేకాకు కృష్ణారెడ్డి ఎంతో న‌మ్మ‌క‌స్తుడిగా పేరు పొందారు. 30 ఏళ్ల పాటు వివేకా వెంట ఉన్నారు. వివేకా తుదిశ్వాస వ‌ర‌కూ ఉన్న పీఏ… ఇప్పుడు ఆయ‌న కుటుంబ స‌భ్యుల నుంచి ప్రాణ‌హాని వుంద‌ని ఫిర్యాదు చేయ‌డం వెనుక పెద్ద‌ల హ‌స్తం వుంద‌నే చ‌ర్చ‌కు దారి తీసింది.

ఇటీవ‌ల వివేకా హ‌త్య కేసులో అల్లుడు రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌స్తం ఉంద‌ని పులివెందుల‌కు చెందిన జ‌ర్న‌లిస్టు భ‌ర‌త్‌కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న ఆరోప‌ణ చేయ‌డం తెలిసిందే. ఇదే విధంగా వివేకా కుటుంబ స‌భ్యుల‌పై ఆరోప‌ణ‌లు చేస్తూ అనంత‌పురం ఎస్పీకి యాడికి చెందిన గంగాధ‌ర్‌రెడ్డి ఫిర్యాదు చేయ‌డం, తాజాగా పీఏ కృష్ణారెడ్డి ముందుకు రావ‌డంతో హ‌త్య కేసు కొత్త మ‌లుపు తిరుగుతోంద‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.