లిప్ లాక్ తో సర్టిఫికెట్ మారిపోయింది

దిల్ రాజు, శిరీష్, బెక్కం వేణుగోపాల్ కలిసి నిర్మిస్తున్న సినిమా 'ఇద్దరి లోకం ఒకటే'. రాజ్ తరుణ్-షాలినీ పాండే హీరో హీరోయిన్లు. ఒక టర్కీ సినిమా ఆధారంగా రూపొందించిన ఈ సినిమా సెన్సారు వ్యవహారాలు…

దిల్ రాజు, శిరీష్, బెక్కం వేణుగోపాల్ కలిసి నిర్మిస్తున్న సినిమా 'ఇద్దరి లోకం ఒకటే'. రాజ్ తరుణ్-షాలినీ పాండే హీరో హీరోయిన్లు. ఒక టర్కీ సినిమా ఆధారంగా రూపొందించిన ఈ సినిమా సెన్సారు వ్యవహారాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయాలన్నది దిల్ రాజు ఆలోచన.

అయితే వెంకీమామ సినిమా వ్యవహారం ఎటూ తేలకుండా గాల్లో వుండడంతో, ఇద్దరి లోకం ఒకటే డేట్ ను ప్రకటించడం లేదు. సెన్సారు చేయించి రెడీగా వుంచారు. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. వాస్తవానికి క్లీన్ యు సర్టిఫికెట్ రావాల్సిన సినిమా.

ఎందుకంటే ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కాబట్టి.అయితే సినిమాలో సందర్భానుసారం, మాంచి లిప్ లాక్ ఒకటి వుందట. కథకు అది తప్పని సరి అని తెలుస్తోంది. దాంతో లిప్ లాక్ వుండడంతో సినిమాకు ఏ కట్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చేసారు.

ఇద్దరి లోకం ఒకటే సినిమాకు కృష్ణారెడ్డి దర్శకుడు.