చిరు ఇంట్లో అలనాటి తారల సందడి

దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన 80వ దశకపు తారలంతా ప్రతి ఏటా ఏదో ఒకచోట చేరి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి రీయూనియన్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ఇల్లు వేదికైంది. Advertisement ఇందుకోసం…

దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన 80వ దశకపు తారలంతా ప్రతి ఏటా ఏదో ఒకచోట చేరి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి రీయూనియన్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ఇల్లు వేదికైంది.

ఇందుకోసం చిరంజీవి తన ఇంట్లో అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అలనాటి ప్రముఖ నటీనటులు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు.

ఈ వేడుకలో రాధిక, శరత్‌కుమార్‌, ప్రభు, భానుచందర్‌, మోహన్‌లాల్‌, రెహమాన్‌, వెంకటేశ్‌, సరిత, లిజీ, సుభాషిణితో పాటు పలువురు తారలు పాల్గొన్నారు. 

బాలీవుడ్,  టాలీవుడ్ – కోలీవుడ్ స‌హా మ‌ల‌యాళం.. క‌న్న‌డం నుంచి మొత్తం 40 మంది తార‌లు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.

గ‌త తొమ్మిదేళ్లుగా ఈ వేడుక‌లు విజ‌య‌వంతంగా జ‌రుగుతున్నాయి. ప‌దో సారి కావడంతో  ఘ‌నంగా మెగాస్టార్  ఈ వేడుక‌ల్ని స్వ‌యంగా నిర్వ‌హించారు.