ఘాతుకం.. ఆ చిన్నారిని సవతి తల్లే చంపేసింది!

శుక్రవారం నుంచి సస్పెన్స్ సినిమాను తలపించిన బాలిక కిడ్నాప్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. పోలీసులు అనుమానమే నిజమైంది. సవతి తల్లే చిన్నారిని హతమార్చింది. 3 రోజుల కింద కిడ్నాప్ కు గురైందంటూ కేసు…

శుక్రవారం నుంచి సస్పెన్స్ సినిమాను తలపించిన బాలిక కిడ్నాప్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. పోలీసులు అనుమానమే నిజమైంది. సవతి తల్లే చిన్నారిని హతమార్చింది. 3 రోజుల కింద కిడ్నాప్ కు గురైందంటూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు, తాజా ట్విస్ట్ తో కొొత్త విషయాలు తెలుసుకున్నారు.

కాకినాడకు చెందిన చిన్నారి దివ్యశ్రీని సవతి తల్లే కడతేర్చింది. ఉప్పుటేరులో పాపను తోసేసినట్టు సవతి తల్లి శాంతికుమారి అంగీకరించింది. దీంతో ధర్మాడి సత్యం బృందం రంగంలోకి దిగింది. ఉప్పుటేరును గాలించింది. చీకటి పడడంతో ఈరోజు పాప ఆచూకి దొరకలేదు. రేపు తిరిగి గాలింపు చర్యలు చేపడతారు. సవతి తల్లి నేరం అంగీకరించడంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చినట్టయింది. కానీ చిన్నారి ఇక లేదనే విషయం తెలిసి తండ్రి, బంధువులు భోరున విలపిస్తున్నారు.

జగన్నాధపురంలో చదువుకుంటున్న ఏడేళ్ల దీప్తిశ్రీని, పాఠశాల ముగిసిన తర్వాత సవతితల్లే తీసుకెళ్లింది. అయితే తనకేం తెలియదని ఆమె బుకాయించింది. ఓ ఐదుగురు దుండగులు వచ్చి పాపను ఎత్తికెళ్లినట్టు నాటకం షురూ చేసింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఈరోజు అసలు విషయం బయటపెట్టింది. తానే చిన్నారిని తోసేసినట్టు అంగీకరించింది.

రేపు ఎట్టిపరిస్థితుల్లో ఉప్పుటేరులో పాప ఆచూకి కనిబెట్టేస్తామంటోంది ధర్మాడి సత్యం బృందం. ఉప్పుటేరుతో పాటు ఇంద్రపాలెం లాకుల వద్ద కూడా గాలింపు చర్యలు చేపడతామన్నారు. మృతదేహం దొరికిన తర్వాత శాంతికుమారిపై మరిన్ని కేసులు నమోదుచేస్తామంటున్నారు పోలీసులు.