రజనీ..కమల్ డుమ్మా

ఎనభైల నాటి సినిమా తారలు ఏటా కలిసి చేసుకునే పార్టీ కార్యక్రమం ఒకటి వుంది. క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పేరుతో ఏటా, ఎక్కువగా చెన్నయ్ లో వివిధ నటుల ఇళ్లలో ఈ కార్యక్రమం జరుగుతూ…

ఎనభైల నాటి సినిమా తారలు ఏటా కలిసి చేసుకునే పార్టీ కార్యక్రమం ఒకటి వుంది. క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పేరుతో ఏటా, ఎక్కువగా చెన్నయ్ లో వివిధ నటుల ఇళ్లలో ఈ కార్యక్రమం జరుగుతూ వస్తోంది.

అందరు నటులు ఒకేలాంటి యూనిఫారమ్ డ్రెస్ కోడ్ తో, సరదా సందడి జరిగేది. ఈ సమావేశానికి టాలీవుడ్ నుంచి ఎప్పుడూ ఎవరు వెళ్లినా వెళ్లకున్నా, మెగాస్టార్ చిరంజీవి కచ్చితంగా హాజరవుతూ వస్తున్నారు. 

తొలిసారి ఈ క్లాస్ ఆఫ్ ఎయిటీస్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఇల్లు దీనికి వేదిక అయింది. చిరంజీవి తన ఇల్లు ను పునర్నిర్మించారు. తన పాత ఇల్లును ఈ జనరేషన్ సాంకేతికత, ఆధునికత ఆలంబనగా అద్భుతంగా రీ మోడల్ చేసారు. ఈ సందర్భంగా ఆయన క్లాస్ ఆఫ్ ఎయిటీస్ కార్యక్రమాన్ని తొలిసారి తన ఇంట్లో నిర్వహించారు.

అయితే ఎప్పుడూ ఈ కార్యక్రమానికి హాజరయ్యే తమిళ టాప్ హీరోలు ఈసారి డుమ్మా కొట్టినట్లు బోగట్టా. అన్ని భాషల నటులు నలభై మంది వరకు హాజరయ్యారు కానీ, తమిళ అగ్ర హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ మాత్రం రాలేదని తెలుస్తోంది.

చెన్నయ్ లో ఎప్పుడు జరిగినా వీరు ఇద్దరూ కానీ ఇద్దరిలో ఒకరు కానీ ఎప్పుడూ వస్తారు. అలాంటిది ఇదే కార్యక్రమం హైదరాబాద్ కు మార్చేసరికి ఇద్దరూ రాకపోవడం ఆశ్చర్యం.

పైగా తన పాత ఇంటిని పూర్తి గా పడగొట్టి, కొత్తగా అద్భతంగా నిర్మించిన ఇంటిని అందరూ చూస్తారని, ఆ ఇంట్లో పార్టీ ఇవ్వాలని అనుకున్నారు మెగాస్టార్. కానీ మరి సినిమాల బిజీవల్లో, ఇతరత్రా బిజీ వల్లో ఆ ఇద్దరూ రాలేదని తెలుస్తోంది.