‘సరిలేరు’ సీక్రెట్ చెప్పిన రావిపూడి

సరిలేరు నీకెవ్వరు సినిమా శరవేగంగా ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కేరళలో ఓ షెడ్యూల్ నడుస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్న…

సరిలేరు నీకెవ్వరు సినిమా శరవేగంగా ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కేరళలో ఓ షెడ్యూల్ నడుస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా హిలేరియస్ గా ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

అయితే కామెడీతో పాటు యాక్షన్ కూడా ఉంటుందని అంటున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. దీంతో పాటు సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కూడా బయటపెట్టాడు.

“ఎవ్వరూ ఊహించని ఓ ఎక్స్ టార్డనరీ సీక్వెన్స్ ఉంటుంది. కథలో అలా ఇన్ వాల్వ్ అవుతూ వెళ్తుంది. అది ఎవ్వరూ ఊహించరు. ఆ పాత్రను అజయ్ చేశాడు. అజయ్ ద్వారా మహేష్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ.. ఓ అద్భుతమైన పాత్రను కథలో రిప్రజెంట్ చేయబోతున్నాం. అదే పెద్ద సస్పెన్స్. ఆ పాత్ర ఏంటి? అజయ్ ద్వారా రాబోతున్న ఆ ట్రాక్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అదొక పెద్ద ఎలివేషన్. అదే సినిమాలో సర్ ప్రైజ్.”

ఇలా సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ కీలకమైన పాయింట్ ను బయటపెట్టాడు అనీల్ రావిపూడి. మహేష్, విజయశాంతి కలుసుకునే సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయని తెలిపిన దర్శకుడు.. సినిమాలో విజయశాంతి మినహా, దాదాపు మిగతా పాత్రలన్నీ కామెడీ పండిస్తాయంటున్నాడు.

మరీ ముఖ్యంగా ప్రకాష్ రాజ్ సీరియస్ గా చేసే కామెడీ హైలెట్ అవుతుందంటున్నాడు. అందుకే టీజర్ లో కూడా ఓ సీన్ పెట్టామంటున్నాడు రావిపూడి.

ఇక టీజర్ విషయానికొస్తే.. రష్మికను కావాలనే టీజర్ లో లేకుండా చేశారట. మహేష్-రష్మిక కాంబోలో సెపరేట్ ప్రోమో కట్ చేశారు. ప్రచారంలో భాగంగా త్వరలోనే ఈ కాంబినేషన్ లో మరో టీజర్ రాబోతోంది.