పవన్‌ మన్మథుడ్ని ఫాలో అవుతున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ  ఎమ్మెల్సీ ఇక్బాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారని.. టీడీపీ ప్రభుత్వ దోపిడీ పై ఎందుకు ప్రశ్నించలేదో పవన్ కల్యాణ్ చెప్పాలని…

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ  ఎమ్మెల్సీ ఇక్బాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారని.. టీడీపీ ప్రభుత్వ దోపిడీ పై ఎందుకు ప్రశ్నించలేదో పవన్ కల్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇంగ్లీషు మీడియంపై చంద్రబాబు, ఇతర విపక్షాల రాద్ధాంతం అనవసరమని.. పేద పిల్లల అభ్యున్నతికి సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్సీ ఇక్బాల్ స్పష్టం చేశారు.  

పవన్ కళ్యాణ్ చెగువీరా తనకు ఆదర్శం అని చెప్పి, ఆయనను కాకుండా, కాసినోవా(మన్మథుడు) ను ఆదర్శంగా తీసుకోవడం అభ్యంతరకరమని వైసిపి ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ ఒకరిని పెళ్లి చేసుకుని ,మరొకరితో కూడా సంబందం పెట్టుకోవడం అనైతికం అని ఆయన అన్నారు. తన వైవాహిక సంబందాలలో ఎలా అనైతికను కనబరిచారో, రాజకీయాలలో కూడా పవన్ కళ్యాణ్ అదే అనైతిక విలువలను కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

గతంలో ప్రశ్నిస్తానని చెప్పి, ఆ తర్వాత ప్రశ్నించకపోవడం కాని, లోకేష్ అవినీతిపై గతంలో మాట్లాడి, తదుపరి మళ్లీ టిడిపితో రహస్య అవగాహన చేసుకోవడం ఇవన్ని అనైతిక రాజకీయాలకు నిదర్శనమని ఆయన అన్నారు.

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వైవాహిక సంబందాలలో అనైతిక వ్యవహారాలు చేసినట్లుగానే, రాజకీయాలలోనూ నడుపుతున్నారని ఆయన అన్నారు.