కింద సుశాంత్.. పై అంతస్తులో రియా పార్టీ

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణం రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. తాజాగా డ్రగ్స్ కోణం కూడా వెలుగులోకి వచ్చింది. దీనికితోడు పనిమనుషులు చెప్పిన కొన్ని విషయాలు, సుశాంత్ తండ్రి తరఫు లాయర్ ఆరోపణలు..…

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణం రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. తాజాగా డ్రగ్స్ కోణం కూడా వెలుగులోకి వచ్చింది. దీనికితోడు పనిమనుషులు చెప్పిన కొన్ని విషయాలు, సుశాంత్ తండ్రి తరఫు లాయర్ ఆరోపణలు.. ఇప్పుడీ కేసును మరింత జటిలం చేశాయి.

ముంబయిలోని ఒకే డూప్లెక్స్ ప్లాట్ లో సుశాంత్-రియా ఉండేవారనే విషయం తెలిసిందే. అయితే చాలా సందర్భాల్లో సుశాంత్ ను రియా పట్టించుకునేది కాదట. కింద సుశాంత్ పడుకుంటే.. పై అంతస్తులో స్నేహితులతో కలిసి రియా పార్టీలు చేసుకునేదట. తాజాగా బయటకొచ్చిన ఈ విషయం.. వాళ్లిద్దరి మధ్య ఉన్న బలహీనమైన బంధాన్ని బయటపెడుతోంది.

మరోవైపు సుశాంత్ తండ్రి కేకే సింగ్ తరఫు న్యాయవాది మరిన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. సుశాంత్ కు రియా డ్రగ్స్ అలవాటు చేసి ఉంటుందని ఆ లాయర్ ఆరోపించారు. సుశాంత్ కు తెలియకుండా కొన్ని నిషేధిత డ్రగ్స్ ను అతడికి ఇచ్చి ఉంటారని.. అవి వాడడం వల్ల సుశాంత్ చనిపోవడం లేదా ఆత్మహత్యకు ప్రేరణ పొంది ఉంటాడని ఆ లాయర్ ఆరోపిస్తున్నారు.

డ్రగ్ డీలర్ తో రియా మాట్లాడినట్టు, సదరు డీలర్ తో ఆమె వాట్సాప్ ఛాట్ చేసినట్టు వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే సుశాంత్ తండ్రి తరఫు న్యాయవాది ఈ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

డ్రగ్ డీలర్ గా రిమార్క్ పొందిన గౌరవ్ ఆర్యతో రియా ఛాట్ చేసినట్టు.. ఎంపీ (నిషేధిత డ్రగ్) ఉందా అంటూ గౌరవ్ ను రియా అడిగినట్టు.. హ్యాష్, బడ్ (తక్కువ మోతాదు డ్రగ్స్) ఉన్నాయా అంటూ శామ్యూల్ మిరందా-రియా మధ్య వాట్సాప్ సంభాషణ జరిగినట్టు నిన్నంతా వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఈడీ-సీబీఐ మధ్య సమాచార మార్పిడి ఈరోజు జరగగా.. ఏ క్షణానైనా రియాను సీబీఐ అదుపులోకి తీసుకుంటుందంటూ బాలీవుడ్ లో కథనాలు వస్తున్నాయి.

మరోవైపు రియా తరఫు న్యాయవాది ఈ వాదనలన్నింటినీ గంపగుత్తగా ఖండిస్తున్నారు. అవసరమైతే రియాకు బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చని, ఆమె తన జీవితంలో డ్రగ్స్ తీసుకోలేదని ఛాలెంజ్ చేస్తున్నారు. మొత్తమ్మీద సుశాంత్ కేసు, ఈరోజు పూర్తిస్థాయిలో డ్రగ్స్ మలుపు తీసుకుంది.

ఆ ముగ్గురు, విధి రాసిన రాత

చిరు పవన్ వరుసగా మెగా ప్రాజెక్టులు