టీడీపీ ఎమ్మెల్యే గొంతులో అమరావతి రాగాన్ని…!

విశాఖ రాజధాని కావడం చంద్రబాబుకు ఇష్టంలేదు. దానికి ఆయన చేస్తున్న విష ప్రచారమే అతి పెద్ద రుజువు. విశాఖ అంటే తనకు ఇష్టమంటూనే చేయాల్సింది అంతా చేస్తున్నారు. విశాఖ వారెవరూ రాజధానికి కోరుకోవడంలేదని పాతిక…

విశాఖ రాజధాని కావడం చంద్రబాబుకు ఇష్టంలేదు. దానికి ఆయన చేస్తున్న విష ప్రచారమే అతి పెద్ద రుజువు. విశాఖ అంటే తనకు ఇష్టమంటూనే చేయాల్సింది అంతా చేస్తున్నారు. విశాఖ వారెవరూ రాజధానికి కోరుకోవడంలేదని పాతిక లక్షల మంది జనాల గొంతును తన గొంతుగా చెప్పేసుకున్న బాబు అమరావతిని రాజధానిగా  నిలబెట్టడానికి శక్తికి మించి శ్రమిస్తున్నారు.

ఈ నేపధ్యంలో విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అమరావతి రాజధానికి అనుకూలంగా రాసిన లేఖ ఒకటి ఇపుడు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. అసలు ఈ లేఖ కధా కమామీష్ ఏంటి అన్నది వాసుపల్లికే తెలియకపోవడం విశేషం అంటున్నారు.  తాను అమరావతికి అనుకూలంగా ఎపుడు మాట్లాడాను అని వాసుపల్లి అంటున్నట్లుగా భోగట్టా.

అసలు తన పేరిట లేఖ ఎలా బయటకు వచ్చింది. అదేలా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అన్నది అర్ధం కాక ఆ ఎమ్మెల్యే తమ్ముడు ఇబ్బందుల్లో పడినట్లుగా సమాచారం.  మొత్తానికి విశాఖలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటే ఎవరూ కూడా ఇప్పటివరకూ బహిరంగంగా అమరావతికి అనుకూలమైన వ్యాఖ్యలు చేయలేదు.  ఏది ఏమైనా వాసుపల్లి అమరావతికి అనుకూలంగా ఉంటే లేఖలు విడుదల చేయరు కదా మీడియా ముందే చెబుతారు కదా అన్న చర్చ కూడా టీడీపీ వస్తోందిట.

మొత్తానికి విశాఖ తమ్ముళ్ళ నోట అమరావతి రాగాలు పలికించే ప్రయత్నం ఏదే తెర వెనక గట్టిగానే సాగుతున్నట్లుగా తెలుస్తోంది అంటున్నారు. మరి ఈ లేఖ ఎలా వచ్చిందో తెలియదు అని  ఎమ్మెల్యే అనుచరులు  చెబుతున్నారని టాక్.

చిరు పవన్ వరుసగా మెగా ప్రాజెక్టులు

అప్ప‌ట్లో శంక‌ర‌రావు…ఇప్పుడు రాఘ‌రామ‌కృష్ణంరాజు