రైలు సెట్ లోకి ప్రభాస్

సాహో ఇచ్చిన విరామం పూర్తయింది. బాహుబలి ప్రభాస్ మళ్లీ సెట్ మీదకు వస్తున్నారు. యువి సంస్థ, సీనియర్ నటుడు కృష్ణం రాజు స్వంత బ్యానర్ కలిసి నిర్మిస్తున్న జాను (వర్కింగ్ టైటిల్) లేటెస్ట్ షెడ్యూలు…

సాహో ఇచ్చిన విరామం పూర్తయింది. బాహుబలి ప్రభాస్ మళ్లీ సెట్ మీదకు వస్తున్నారు. యువి సంస్థ, సీనియర్ నటుడు కృష్ణం రాజు స్వంత బ్యానర్ కలిసి నిర్మిస్తున్న జాను (వర్కింగ్ టైటిల్) లేటెస్ట్ షెడ్యూలు ప్రారంభం కాబోతోంది.

ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో సెట్ రెడీ అయింది. సుమారు రెండు కోట్లకు పైగా ఖర్చుతో వేసిన రెండు రైలు పెట్టెల సెట్ అన్నపూర్ణలో వేసారు.

సినిమా అలనాటి కాలానికి చెందినది కాబట్టి, అప్పట్లో రైలు భోగీలు ఎలా వుండేవో ఆ విధంగా సెట్ వేసారు ఆర్ట్ డైరక్టర్ రవీందర్. ఈ సెట్ లో సుమారు 11 రోజులు షూటింగ్ వుంటుంది.

ఇప్పటికి ముఫై శాతం పూర్తయింది జాను సినిమా. ఇంకో 70 శాతం వుంది. అన్నపూర్ణలో జరిపే ఈ షెడ్యూలుతో ప్రారంభించి, ఇక చకచకా ఫినిష్ చేసే ఆలోచనలో వుంది యువి నిర్మాణ సంస్థ.

ఆ మధ్యనే ఇదే అన్నపూర్ణ స్టూడియోలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం కూడా రైలు పెట్టె సెట్ వేసి, బోలెడు రోజులు షూటింగ్ జరిపారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు అదే అన్నపూర్ణలో మరో రైలు సెట్ వేసారు ప్రభాస్ కోసం.