తన ఇద్దరు పిల్లల్ని పరిచయం చేసిన నయనతార

సౌత్ లో స్టార్ స్టేటస్ తో దూసుకుపోతున్న నయనతార సోషల్ మీడియాకు దూరమనే సంగతి తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ, ట్విట్టర్ లో కనిపించదు. కేవలం అభిమానులు మాత్రమే…

సౌత్ లో స్టార్ స్టేటస్ తో దూసుకుపోతున్న నయనతార సోషల్ మీడియాకు దూరమనే సంగతి తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ, ట్విట్టర్ లో కనిపించదు. కేవలం అభిమానులు మాత్రమే ఆమె ఎకౌంట్ ను మెయింటైన్ చేస్తున్నారు. అలాంటి నయనతార ఉన్నఫలంగా సోషల్ మీడియాలోకి ఎంటరైంది.

అవును.. ఇనస్టాగ్రామ్ లోకి వచ్చింది నయనతార. ఆమె ఇలా అడుగుపెట్టిన వెంటనే అలా ఫాలోవర్స్ పోటెత్తారు. గంటల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ వచ్చారు. గంటగంటకు ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.

ఇనస్టాలోకి వస్తూనే, తన ఇద్దరు పిల్లల్ని పరిచయం చేసింది నయనతార. ఇన్నాళ్లూ వాళ్ల ముఖాల్ని చూపించడానికి ఇష్టపడలేదు నయన్-విఘ్నేష్ దంపతులు. ఇనస్టాలో అడుగుపెట్టిన సందర్భంగా తన ఇద్దరు పిల్లలతో కలిసి చిన్న వీడియోను విడుదల చేసింది ఈ హీరోయిన్.

ఇంతకీ నయనతార ఉన్నట్టుండి ఇనస్టాగ్రామ్ లోకి ఎందుకొచ్చిందో తెలుసా? ఆమె బాలీవుడ్ లో అడుగుపెట్టింది. షారూక్ సరసన జవాన్ సినిమా చేసింది. మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఆ మూవీకి సంబంధించి ట్రయిలర్ రిలీజ్ చేశారు. ఆ సినిమాకు ప్రచారం కల్పించడం కోసం మాత్రమే నయనతార ఇనస్టాలోకి అడుగుపెట్టింది.

పిల్లలతో చేసిన రీల్ ను పోస్ట్ చేసిన వెంటనే.. మినిమం గ్యాప్స్ లో జవాన్ సినిమాకు సంబంధించి తెలుగు, తమిళ, హిందీ వెర్షన్ ట్రయిలర్స్ ను ఆమె పోస్ట్ చేసింది. దీంతో నయనతార సోషల్ మీడియా ఎంట్రీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ హీరోయిన్ మరోసారి సైలెంట్ అయిపోతుందని, సోషల్ మీడియాకు దూరమౌతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొందరు మాత్రం ఈసారి నయన్, కొనసాగుతుందని చెబుతున్నారు.

నయన్ భర్త విఘ్నేష్, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. సో.. భర్త దారిలో నయన్ కూడా ఇకపై అందరికీ అందుబాటులో ఉంటుందని అంటున్నారు.