సంక్రాంతికి కానుక..టికెట్ రేట్ల పెంపు

సంక్రాంతి సినిమాలకు టికెట్ రేట్లు పెరగనున్నాయి. వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాల నిర్మాతలు ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించారు. తొలి విడతగా అమరావతి వెళ్లి సిఎమ్ పేషీ లో ఈ మేరకు దరఖాస్తు చేసి…

సంక్రాంతి సినిమాలకు టికెట్ రేట్లు పెరగనున్నాయి. వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాల నిర్మాతలు ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించారు. తొలి విడతగా అమరావతి వెళ్లి సిఎమ్ పేషీ లో ఈ మేరకు దరఖాస్తు చేసి వచ్చారు. సిఎమ్ కార్యదర్శి ధనుంజయ రెడ్డిని కలిసి మొత్తం సినిమాల పరిస్థితి, బడ్జెట్, ఇవన్నీ వివరించి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు సిఎమ్ జగన్ తో మాట్లాడి ఒకటి రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరీ ఎక్కువ పెంపు వుండకపోవచ్చు. జస్ట్ 50 రూపాయల పెంపు మాత్రమే వుంటుందని తెలుస్తోంది. ఈ మేరకు వుండకపోతే వీలయినంత త్వరగా రికవరీ రావడం కష్టం అవుతుంది. యాభై రూపాయలు పెంచడం ద్వారా పండగ నాలుగు రోజుల్లో మంచి నెంబర్లు కనిపించెే అవకాశం వుంది.

మెగాస్టార్, బాలయ్య రెండు సినిమాలకు పెంచితే ఏ గొడవా లేదు. ఎందుకంటే వీళ్లకు పెంచారు, వాళ్లకి పెంచలేదు అనే సమస్య రాదు. రెండు గ్రూపులు సంతృప్తిగా వుంటాయి. ఫ్యాన్స్ నుంచి ఏ విమర్శలూ వుండవు. 

ఇదిలా వుంటే పండగ కు మరో మూడు సినిమాలు వున్నాయి. విజయ్ వారసుడు, అజిత్ తెగింపు, చిన్న సినిమా కళ్యాణం కమనీయం. వీటికి మాత్రం ఇలాంటి పెంపు ఆలోచనలు వున్నట్లు వినిపించడం లేదు.