దెయ్యం వదిలిస్తానన్నాడు.. అత్యాచారం చేశాడు

మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న 14 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో జరిగింది. నిందితుడిని 45 ఏళ్ల అశోక్ కుమార్‌గా గుర్తించారు. “దెయ్యాన్ని వదిలిస్తాననే” సాకుతో అతను…

మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న 14 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో జరిగింది. నిందితుడిని 45 ఏళ్ల అశోక్ కుమార్‌గా గుర్తించారు. “దెయ్యాన్ని వదిలిస్తాననే” సాకుతో అతను మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు.

బాధిత బాలిక మూడేళ్లుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతోంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకుంటోంది. అయితే ఆమె పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు.

సరిగ్గా అదే టైమ్ లో ఆ కుటుంబానికి దగ్గరయ్యాడు అశోక్. బాలికకు దెయ్యం పట్టిందన్నాడు, ఆ దుష్టశక్తిని వదిలించడం ఎలాగో తనకు బాగా తెలుసని నమ్మబలికాడు. కొన్ని రోజులు బాలిక ఇంటికి తరచుగా వచ్చి పోతుండేవాడు అశోక్.

ఈ క్రమంలో ఓసారి బాలిక ఇంటికొచ్చాడు. ఆ టైమ్ లో ఇంట్లో తండ్రి లేడు. దెయ్యాన్ని వదిలిస్తాను పాపను తనతో పంపించాల్సిందిగా తల్లిని ఒప్పించాడు. బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇంటికొచ్చిన బాలిక తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో అశోక్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టంలోకి వివిధ సెక్షన్ల కింద అశోక్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.