సిద్దు మ్యాజిక్..ఏడడుగుల వాన

మ్యూజిక్ డైరక్టర్ గోపీ సుందర్..గీతా సంస్థ..సిద్దు శ్రీరామ్..అనగానే గీతగోవిందం గుర్తుకు వస్తుంది. అప్పటి నుంచి సిద్దు పాటలు అన్నవి ఓ సెంటిమెంట్ గా మారిపోయాయి సినిమాలకు. లేటెస్ట్ గా ఇదే కాంబినేషన్ లో మళ్లీ…

మ్యూజిక్ డైరక్టర్ గోపీ సుందర్..గీతా సంస్థ..సిద్దు శ్రీరామ్..అనగానే గీతగోవిందం గుర్తుకు వస్తుంది. అప్పటి నుంచి సిద్దు పాటలు అన్నవి ఓ సెంటిమెంట్ గా మారిపోయాయి సినిమాలకు. లేటెస్ట్ గా ఇదే కాంబినేషన్ లో మళ్లీ 18 పేజెస్ సినిమా వస్తోంది. ఈ సినిమా కోసం గోపీసుందర్ స్వరపర్చిన సిద్దూ పాడిన పాటను ఈ రోజు విడుదల చేసారు. నిఖిల్-అనుపమ ల మీద ఈ పాట చిత్రీకరించారు.

ఏడడుగుల వాన..రెండు కళ్లల్లోన..కారణం ఎవరంటే అక్షరాల నువ్వే..ఇన్నిన్నాళ్లు వున్నా..ఇప్పుడే పుడుతున్నా..కారణం ఎవరంటే కచ్చితంగా నువ్వే..అంటూ శ్రీమణి అందించిన సాహిత్యం బాగుంది. ఇలా ప్రారంభమైన పాట..మంచి అలతి లలతి పదాలతో కదం తొక్కుతూ సాగింది. ట్యూన్ కాస్త టిపికల్ గా వున్నా, సిద్దూ గొంతులో వున్న మ్యాజిక్ మాత్రం ఎప్పటిలా కంటిన్యూ అయింది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి నన్నయ రాసిన అంటూ సాగే పాట బాగా క్లిక్ అయింది. దర్శకుడు సుకుమార్ కథతో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తయారవుతున్న ఈ సినిమాకు నిర్మాత బన్నీ వాస్.ఈ పాటను ఈ రోజు జరిగిన మీడియా మీట్ లో విడుదల చేసారు. 

నిఖిల్..అనుపమ, అల్లు అరవింద్..బన్నీ వాస్, గోపీసుందర్ తదితరులు ఈ మీట్ లో పాల్గొని ప్రసంగించారు. ఈనెల 23న సిని విడుదలవుతోంది. దర్శకుడు ప్రతాప్ కు ఇది మూడో సినిమా. రెండో సినిమా కుమారి 21 ఎఫ్ పెద్ద హిట్ అయింది. ఇది మలి సినిమా.