లస్ట్ స్టోరీస్ లో అమలపాల్!

హిందీలో బాగా చర్చనీయాంశంగా నిలిచిన వెబ్ సీరిస్ 'లస్ట్ స్టోరీస్' తెలుగు రీమేక్ కు రంగం సిద్ధం అవుతూ ఉంది. హిందీలో కియరా అద్వానీ చేసిన పాత్రకు తెలుగులో హీరోయిన్ ఫిక్స్ అయ్యింది. బోల్డ్…

హిందీలో బాగా చర్చనీయాంశంగా నిలిచిన వెబ్ సీరిస్ 'లస్ట్ స్టోరీస్' తెలుగు రీమేక్ కు రంగం సిద్ధం అవుతూ ఉంది. హిందీలో కియరా అద్వానీ చేసిన పాత్రకు తెలుగులో హీరోయిన్ ఫిక్స్ అయ్యింది. బోల్డ్ గా, రా గా నటించాల్సిన ఆ పాత్రకు కియరా అద్వానీని ఎంపిక చేసినట్టుగా సమాచారం. నందినీ రెడ్డి దర్శకత్వంలో లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ రూపొందనుంది.

హిందీలో ఈ వెబ్ సీరిస్ బోలెడన్ని వీక్షణలను పొందింది. భర్త నుంచి సెక్స్ లో అసంతృప్తి పొందుతున్న ఒక ఆధునిక అతివ పాత్రలో కియరా అద్వానీ నటించింది. అందుకు సంబంధించిన సన్నివేశాలను చాలా పచ్చిగానే చిత్రీకరించారు. లస్ట్ స్టోరీస్ లో నటించిన సమయానికి కియరాకు ఇంత నేము, ఫేమూ లేదు. బహుశా ఇప్పుడైతే ఆమె అయినా నటించేదో లేదో!

అయితే ఆ వెబ్ సీరిస్ హిట్ కావడంతో.. కియరా అద్వానీకి చాలా పేరు వచ్చేసింది. అందులో నటించినందుకు గర్వంగా ఉందన్నట్టుగా కూడా ఆమె ప్రకటనలు చేసుకుంది. ఇక ఇటీవలే తమిళ సినిమా 'ఆడై'లో నగ్నంగా నటించినట్టుగా ప్రకటించుకుంది అమలపాల్. అది తనకు గర్వకారణం అన్నట్టుగా ఆమె చెప్పుకొచ్చింది.

ఈ నేపథ్యంలో అమలపాల్ ను లస్ట్ స్టోరీస్ రీమేక్ కు ఎంచుకుందట దర్శకురాలు నందినీ రెడ్డి. ఈ వెబ్ సీరిస్ ఫస్ట్ పార్ట్ కు నందిని దర్శకత్వం వహించనుంది. ఈ భాగంలోని జగపతి బాబు కూడా ఒక కీలకపాత్ర పోషించబోతున్నాడని సమాచారం.

అఖిలప్రియ.. కేరాఫ్ గందరగోళ రాజకీయం!