నాదెండ్ల మాట‌ల‌కు న‌వ్వొద్దు ప్లీజ్‌!

నాదెండ్ల మ‌నోహ‌ర్ సీరియ‌స్ పొలిటీషియ‌న్‌. జ‌నసేన‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌ర్వాతి స్థానం ఆయ‌న‌దే. ప‌వ‌న్‌ను చెడ‌గొడుతున్నార‌నే విమ‌ర్శ‌లు ఎప్ప‌టి నుంచో ఆయ‌న‌పై వున్నాయి. ఏ మాట‌కా మాట చెప్పుకోవాలంటే… ప‌వ‌న్‌కు న‌మ్మ‌క‌స్తుడైన నాయ‌కుడు. ఇందులో మ‌రో…

నాదెండ్ల మ‌నోహ‌ర్ సీరియ‌స్ పొలిటీషియ‌న్‌. జ‌నసేన‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌ర్వాతి స్థానం ఆయ‌న‌దే. ప‌వ‌న్‌ను చెడ‌గొడుతున్నార‌నే విమ‌ర్శ‌లు ఎప్ప‌టి నుంచో ఆయ‌న‌పై వున్నాయి. ఏ మాట‌కా మాట చెప్పుకోవాలంటే… ప‌వ‌న్‌కు న‌మ్మ‌క‌స్తుడైన నాయ‌కుడు. ఇందులో మ‌రో మాట‌కు తావు లేదు. అందుకే నాదెండ్ల మ‌నోహ‌ర్‌ను త‌న పార్టీ పీఏసీ చైర్మ‌న్‌గా ప‌వ‌న్ నియ‌మించారు.

జ‌న‌సేనకు విధి విధానాలున్నాయ‌ని అప్పుడ‌ప్పుడు నాదెండ్ల మాట‌లు విన్న‌ప్పుడు మాత్ర‌మే తెలుస్తుంటుంది. ఎందుకంటే ప‌వ‌న్ ప్ర‌సంగంలో అరుపులు, మెరుపులు త‌ప్ప‌, విధానాలు వుండ‌వ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇవాళ మీడియాతో మాట్లాడిన నాదెండ్ల మ‌నోహ‌ర్ భారీ కామెడీ డైలాగ్ చెప్పారు. ఆయ‌న సీరియ‌స్‌గా చెప్పిన‌ప్ప‌టికీ, విన్న‌వాళ్లు మాత్రం న‌వ్వ‌కుండా వుండ‌లేరు.

త‌మ పార్టీ అధికారంలోకి వచ్చిన‌ మొదటి ఏడాది నుంచి యువతలో భరోసా కల్పిస్తామని నాదెండ్ల మ‌రోహ‌ర్ హామీ ఇచ్చారు. అలాగే చక్కటి వాతావరణంలో వారి గ్రామాల్లోనే నివసించే విధంగా ఉపాధి పొందుతామనే భరోసా ఇస్తామని నాదెండ్ల చెప్పుకొచ్చారు. ఇంత‌కంటే కామెడీ మ‌రేదైనా వుందా? ఎవ‌రైనా నిద్ర‌లో క‌ల‌లు క‌నేవాళ్లుంటారు. అదేంటో గానీ నాదెండ్ల ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు. చివ‌రికి జ‌న‌సేన అధినాయ‌కుడికే అధికారంలోకి వ‌స్తామ‌ని న‌మ్మ‌కం లేదు.

అలాంటిది నాదెండ్ల మ‌నోహ‌ర్‌లో ఎక్క‌డి నుంచో వ‌చ్చిందో అర్థం కావ‌డం లేదు. అధికారంలోకి వ‌స్తార‌ట‌, వెంట‌నే యువ‌త‌లో భ‌రోసా క‌ల్పిస్తామ‌ని నాదెండ్ల మాట‌లు విన్న త‌ర్వాత ప‌డిప‌డి న‌వ్వుకోకుండా వుండ‌లేరు. భ‌విష్య‌త్‌పై ప‌వ‌న్‌కు భ‌రోసా క‌ల్పించే మాట‌లు నాదెండ్ల చెబితే బాగుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

క‌నీసం ప‌వ‌న్ ఒక్క చోటైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టే దారేది? అని త‌ల బ‌ద్ధ‌ల‌య్యేలా ఆలోచిస్తున్న ప‌రిస్థితి. ఇంత దారుణ ప‌రిస్థితిలో అధికారం గురించి క‌ల‌లు క‌న‌డం… వామ్మో నాదెండ్లా నువు దేవుడ‌య్యా సామి అని నెటిజ‌న్లు ఆడుకుంటున్నారు.