దర్శకుడు రాజమౌళికి కరోనా

టాలీవుడ్ కు షాకింగ్ న్యూస్. దర్శకుడు రాజమౌళి కరోనా బారిన పడ్డాడు. అతడితో పాటు అతడి కుటుంబ సభ్యులకు స్వల్పంగా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆ దర్శకుడు బయటపెట్టాడు. Advertisement…

టాలీవుడ్ కు షాకింగ్ న్యూస్. దర్శకుడు రాజమౌళి కరోనా బారిన పడ్డాడు. అతడితో పాటు అతడి కుటుంబ సభ్యులకు స్వల్పంగా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆ దర్శకుడు బయటపెట్టాడు.

“కొన్ని రోజుల కిందట నాకు, నా కుటుంబ సభ్యులకు కొద్దిగా జ్వరం వచ్చింది. తర్వాత దానంతట అదే తగ్గిపోయింది. అయినా కానీ మేం పరీక్షలు చేయించుకున్నాం. ఈరోజు వచ్చిన ఫలితాల్లో కొద్ది మోతాదులో కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. డాక్టర్ల సలహా మేరకు మేం హోమ్ క్వారంటైన్ లో ఉన్నాం”

ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత పరిమిత సంఖ్యలో సిబ్బందితో టెస్ట్ షూట్ చేయాలనుకున్నారు. కానీ సాధ్యం కాక షూట్ ఆపేశారు.

టెస్ట్ షూట్ చేసిన తర్వాత పొరపాటున ఎవరికైనా కరోనా సోకితే అది టోటల్ యూనిట్ కే ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతో ట్రయిల్ షూట్ ను కూడా నిర్వహించలేదు రాజమౌళి. అలాంటి దర్శకుడికే ఇప్పుడు కరోనా సోకింది. ప్రస్తుతం తమకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని ప్రకటించాడు రాజమౌళి

“ప్రస్తుతం మేమంతా బాగున్నాం. మాకు ఎలాంటి లక్షణాలు లేవు. కానీ మేం అన్ని జాగ్రత్తలు, వైద్యుల సూచనలు పాటిస్తున్నాం. మా శరీరంలో యాంటీబాడీస్ డెవలప్ అవ్వడం కోసం వేచి చూస్తున్నాం. ఆ తర్వాత మేం ప్లాస్మా డొనేట్ చేస్తాం”